-
ఒక్క రోజులో మీరు ఎన్ని ఎస్ ఎం ఎస్ లు పంపుతారు? లేదా ఒక్క నెలలో ఎన్ని సందేశాలు పంపుతారు?
భావ వ్యక్తీకరణకు సంక్షిప్త సందేశానికి (ఎస్సెమ్మెస్) మించిన సాధనం లేదని భావిస్తున్న రోజులు ఇవి. ఎస్ ఎం ఎస్ ల సంఖ్య రోజు రోజుకు చాంతాడులా పెరిగిపోతోంది. ఇపుడు ప్రతి సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు ఇతరులకు చేరుతున్నాయని ఐక్య రాజ్య సమితి (ఐరాస) దూర ప్రసార సంస్థ వెల్లడించింది. మూడేళ్లలో ఇది మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2007లో 1.8 ట్రిలియన్ సంక్షిప్త సందేశాలు నమోదయ్యాయి. అది 2010 వచ్చేసరికి 6.1 ట్రిలియన్ దాటింది. వీటి కోసం ప్రజలు సెకనుకు రూ.6.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 2009 లెక్కల ప్రకారం సంక్షిప్త సందేశాలతో కాలం గడిపేవారిలో ఫిలిప్పీన్స్, అమెరికన్లు ముందున్నారు. -
బాదం గింజలు బలవర్థకమైన ఆహారమే కాదు.. తరచూ వచ్చే జలుబు, జ్వరాలకు దివ్యౌషధంగా పనిచేస్తాయని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుందని తెలిపింది. బాదం పైపొర రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఇటలీలోని పాలీక్లినికో వర్సిటీ శాస్త్రవేత్త గైసెప్పినా చెప్పారు. తెల్లరక్తకణాల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శరీరంలో వైరస్ల వ్యాప్తిని అరికట్టడంలోనూ బాదం పాత్ర కీలకమని వివరించారు. గింజలు పూర్తిగా అరిగిపోయిన తర్వాత కూడా వాటి ప్రభావం ఉంటుందన్నారు. ''బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, జ్వరంపై ఇవి అద్భుతంగా పనిచేస్తాయి'' అని తెలిపారు.
-
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమనౌక డిస్కవరీ అంతరిక్షంలోకి చివరిసారిగా పయనమైనప్పుడు 16 ఎలుకలు ప్రయాణమయ్యాయి. అంతరిక్ష యాత్రల వల్ల వ్యోమగాముల రోగనిరోధకశక్తి తాత్కాలికంగా క్షీణించడానికి కారణాలను వెతికి పట్టుకునే ప్రయోగంలో భాగంగా వీటిని రోదసిలోకి పంపుతున్నారు. అంతరిక్ష యాత్రల కారణంగా వ్యోమగాముల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి. వైరస్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల బారిన పడడాన్ని నాసా 25 ఏళ్ల నుంచి గమనిస్తోంది. తాజా ప్రయోగాన్ని టెక్సాస్ విశ్వవిద్యాలయంతో పాటు నాసాకు చెందిన ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నాయి. -
తీసుకునే ఆహారం కారణంగా మనిషి ఏటా రెండు టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్డై ఆక్సైడ్)ను విడుదల చేస్తాడని ఒక అధ్యయనంలో తేలింది. ''మనిషి తీసుకునే ఆహారం నుంచి ఏటా రెండు టన్నుల చొప్పున కార్బన్డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. మనిషి నుంచి విడుదలయ్యే వాయువుల్లో దీనిది 20 శాతంగా ఉంటుంది'' అని ప్రధాన పరిశోధకుడు ఇవాన్ మౌజ్ తెలిపారు. స్పెయిన్కు చెందిన ఆల్మెర్ వర్శిటీ చేసిన పరిశోధనా ఫలితాలను 'జీవన చక్రం - అంచనాలు' అన్న అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. - చంద్రునిపై పుష్కలమైన నీటి వనరులతో పాటు జలచక్రం (వాటర్సైకిల్) కూడా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటివనరులు జల, వాయు, ఘన రూపాల్లోకి మారుతూ నీటి నిల్వలను స్థిరంగా ఉంచటాన్ని జలచక్రం అంటారని మనకు తెలుసు కదా. జీవం ఉనికికి జలచక్రం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఎల్క్రాస్, ఎల్ఆర్ఓ అనే రెండు ఉపగ్రహాల ద్వారా నాసా చందమామపైనా జలచక్రం కొనసాగుతున్నట్టు గుర్తించింది. ఈ రెండు ఉపగ్రహాల నుంచి దూసుకెళ్లిన రాకెట్లు చంద్రునిపై ఎన్నడూ సూర్యకాంతి పడని'కాబియస్' అనే లోయను గత ఏడాది అక్టోబర్ 9న ఢీకొన్నాయి. ఆ తాకిడివల్ల ఎగసిన 10 మైళ్ల ఎత్తు ధూళి మేఘాన్ని ఉపగ్రహాల్లోని పరికరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ధూళిమేఘంలో స్వచ్ఛమైన మంచు స్ఫటికాలు, హైడ్రోజన్వాయువు, అమ్మోనియా, మీథేన్ తదితర రసాయనిక సమ్మేళనాలున్నాయని గుర్తించారు. వూహించినదానికన్నా అధిక నీరు చంద్రునిపై ఉందని నాసా పేర్కొంది. చంద్రునిపైకి వెళ్లే వారికి అవసరమైన జల, ఇంధన అవసరాలు వీటి ద్వారా తీరుతాయని ముఖ్యశాస్త్రవేత్త ఆంథోనికొల్ప్రిట్ తెలిపారు.
-
ఆఫ్రికాకు చెందిన భయంకరమైన రెండు జాతుల మలేరియా దోమలు జన్యుపరంగా తేడాలున్న రెండు కొత్త జాతులుగా రూపాంతరం చెందుతున్నట్లు లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మలేరియాతో జరిపే పోరుపై ఈ ఆవిష్కరణ ప్రభావం చూపనుంది. ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి కారణమైన అనోఫెలెస్ గాంబియా అనే దోమలపై లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ దోమలకు చెందిన రెండు జాతులు వాటి జన్యుపరిణామ క్రమంలో వేగంగా విడిపోతున్నట్లు కనుగొన్నారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యాధి నివారణకు కొత్త ఔషధాలను కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ''దోమల్లో అత్యంత వేగంగా కొత్త జాతులు పుట్టుకొస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఓ జాతి నివారణ పద్ధతి మరో జాతి దోమలపై సమర్థంగా పనిచేయడం లేదు'' అని పరిశోధన బృందం సభ్యుడు మారియా లానిక్జాక్ తెలిపారు. -
రక్తమార్పిడి తప్పనిసరైన లుకేమియా తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మెక్మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన మూలకణ, క్యాన్సర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త మిక్భాటియా సారథ్యం లో ఈ విజయం సాధించారు. ఈ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తే శస్త్రచికిత్సలు, ఇతరత్రా రక్తమార్పిడి అవసరమైన సందర్భాల్లో ఎవరి రక్తాన్ని వారే ఉపయోగించుకుని స్వస్థత పొందవచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ విధానంలో సేకరించిన మానవ చర్మకణాలను నేరుగా రక్తంగా రూపాంతరం చెందిస్తారు. ఇది మూలకణాల ద్వారా రక్తం తయారీ ప్రక్రియ కంటే సులువైన విధానమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, కేవలం యౌవన ప్రాయంలో ఉన్న వ్యక్తులనుంచి సేకరించే చర్మకణాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. -
డ్రైవర్ అక్కర్లేని కారు తయారీలో గూగుల్ నిమగ్నమైంది. అంతర్జాల దిగ్గజం గూగుల్ ఇంటర్ నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. డ్రైవర్ అవసరం లేకుండా తనంతట తానే సొంతంగా నడిచే కారును రూపొందించే పనిలో గూగుల్ ఇపుడు నిమగ్నమైంది. గూగుల్ ప్రయోగాత్మకంగా రూపొందించిన 7 కార్లు మానవ ప్రమేయం లేకుండానే 1000 మైళ్లు ప్రయాణించినట్లు 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సాయంతో నడిచే ఈ కారు తనకి సమీపంలో ఏమున్నా గ్రహిస్తుంది. దానికి అనుగుణంగా స్వయంగా నిర్ణయం తీసుకొంటుంది.
-
* 1 తంగేడు పూచినట్లు
* 2 తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
* 3 తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
* 4 తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
* 5 తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
* 6 తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
* 7 తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
* 8 తగిలిన కాలే తగులుతుంది
* 9 తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
* 10 తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
* 11 తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
* 12 తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
* 13 తడిశిన కుక్కి బిగిశినట్టు
* 14 తడిశి ముప్పందుం మోశినట్టు
* 15 తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
* 16 తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
* 17 తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
* 18 తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
* 19 తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
* 20 తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
* 21 తనకు కానిది గూడులంజ
* 22 తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
* 23 తడి గుడ్డతో గొంతులు కొయ్యడం
* 24 తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
* 25 తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
* 26 తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
* 27 తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
* 28 తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
* 29 తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
* 30 తల ప్రాణం తోకకి వచ్చినట్లు
* 31 తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
* 32 తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
* 33 తవుడు తింటూ వయ్యారమా?
* 34 తాగిన మందు ఉంచుకొన్నదాని పొందు ఎలాంటి పనైనా చేయిస్తుంది
* 35 తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
* 36 తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
* 37 తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
* 38 తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
* 39 తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
* 40 తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
* 41 తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
* 42 తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
* 43 తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
* 44 తాతకు దగ్గులు నేర్పినట్టు
* 45 తాదూర సందు లేదు, మెడకో డోలు
* 46 తానా అంటే తందానా అన్నట్లు
* 47 తామరాకు మీద నీటిబొట్టులా
* 48 తాను దూర సందు లేదు తలకో కిరీటమట
* 49 తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
* 50 తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
* 51 తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
* 52 తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి
* 53 తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
* 54 తిట్టను పోరా గాడిదా అన్నట్టు
* 55 తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
* 56 తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
* 57 తినగ తినగ వేము తియ్యగనుండు
* 58 తినబోతూ రుచులు అడిగినట్లు
* 59 తిన్నింటి వాసాలు లెక్కేయటం
* 60 తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
* 61 తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
* 62 తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
* 63 తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
* 64 తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
* 65 తేలు కుట్టిన దొంగలా - కేంద్ర ప్రభుత్వం ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో వ్యాపార ప్రయోజనాల కోసం ఏనుగులను చంపుతున్నారు, దీంతో వాటి సంఖ్య తగ్గుతున్ననేపథ్యంలో ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం 12 మంది సభ్యులతో ఏనుగుల పరిరక్షణ కోసం 'ఎలిఫెంట్ టాస్క్ఫోర్స్'ను నియమించింది. ఏనుగులకు ప్రత్యేక గుర్తింపును కల్పించడం ద్వారా వాటిని సంరక్షించవచ్చని కమిటీ సభ్యులు నివేదిక ఇచ్చారు. ఇటీవల జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ''ఏనుగులు ఎన్నో ఏళ్లుగా మన సంస్కృతిలో భాగం. పులుల లానే వీటిని సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది'' అని పర్యావరణశాఖ మంత్రి జైరాం రమేష్ ఒక ప్రకటనలో.. పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని సవరించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు పార్లమెంటు శీతకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
-
కెప్లర్ టెలిస్కోప్ సుదూరాన ఉన్న ఒక గ్రహవ్యవస్థను నాసా శాస్త్రవేత్తలకు పరిచయం చేసింది. రోదసిలో భూమివంటి గ్రహాలేమైనా ఉన్నాయా అన్న దానిపై కెప్లర్ టెలిస్కోప్ అన్వేషణ జరుపుతుంది. సూర్యునిలాగే ఉన్న ఒక నక్షత్రం చుట్టూ శని గ్రహం పరిమాణంలో ఉన్న రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని పరిశోధనలో తెలిసింది. భూమి సైజుకు కొద్దిగా పెద్దగా ఉన్న మరొక గ్రహం కూడా నక్షత్రానికి కొంత సమీపంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది గ్రహమా కాదా అన్న విషయాన్ని నిర్థారించవల్సి ఉంది. అది గ్రహమే అయితే దానిపై జీవం ఉనికి ఉండే అవకాశాలు లేకపోలేదన్నారు. నాసా గత ఏడాది అంతరిక్షంలోకి ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోపు ప్రత్యేకంగా భూమి వంటి గ్రహాలనే గుర్తిస్తుంది. నక్షత్రానికి మరీ దగ్గరగా, మరీ దూరంగా ఉండకుండా మధ్యస్థంగా ఉండే భూమివంటి గ్రహాల్లోనే జీవం ఉనికిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరహా గ్రహాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. -
పరీక్షల్లో రాకపోతేమీకు మంచి మార్కులు,కలెక్టర్లు కాదు, మీరుకాగలరట క్లర్కులు!
ఆటపాటలసలేమీవద్దని కా దర్థం,ఎంతో విలువైన టైము,చేయరాదు వ్యర్థం!
వారానికి ఒక్కసారిచాలు మీకు వీడియో,అప్పుడపుడు వినవచ్చునువీలయితే రేడియో!
వ్యసనంగా మారరాదుఇంటివద్ద టీ.వీ.సండే ఉదయాన తప్పపనికొచ్చే వేవీ?
కళ్ళు ఉరిమి చూసిందనినిన్ను క్లాసు టీచరు,అమ్మకి మొరపెట్టరాదు,తనొక పూరు క్రీచరు!
వచ్చే సంచిక వరకూచాలును ఈ పాఠంనాకూ వేరే వున్నదికద ఒక జంఝాటం!
- దేవీప్రియ అంకుల్ -
-
సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
* 1 పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
* 2 పగటి ముచ్చట పని చేటు
* 3 పండిత పుత్ర పరమ శుంఠ
* 4 పండితపుత్రుడు... కానీ పండితుడే...
* 5 పందికేంతెలుసు పన్నీరు వాసన
* 6 పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
* 7 పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
* 8 పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
* 9 పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
* 10 పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
* 11 పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
* 12 పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
* 13 పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
* 14 పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
* 15 పావలా కోడికి ముప్పావలా దిష్టి
* 16 పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
* 17 పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
* 18 పాలు, నీళ్ళలా కలిసిపోయారు
* 19 పిండి కొద్దీ రొట్టె
* 20 పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
* 21 పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
* 22 పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
* 23 పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
* 24 పిచ్చోడి చేతిలో రాయి
* 25 పిచ్చోడికి పింగే లోకం
* 26 పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
* 27 పిల్లికి బిచ్చం పెట్టనివాడు
* 28 పుండుకు పుల్ల మొగుడు
* 29 పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
* 30 పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
* 31 పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
* 32 పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
* 33 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
* 34 పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
* 35 పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
* 36 పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
* 37 పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
* 38 పెరుగుట విరుగుట కొరకే
* 39 పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
* 40 పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
* 41 పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
* 42 పైన పటారం, లోన లొటారం
* 43 పొట్టోడికి పుట్టెడు బుద్దులు
* 44 పొమ్మనలేక పొగపెట్టినట్లు
* 45 పొయ్యి దగ్గర పోలీసు
* 46 పొరుగింటి పుల్లకూర రుచి
* 47 పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు -
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనున్న 7, 9 తరగతుల పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు, విపత్తు నిర్వహణ తదితర అంశాలు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఈ విషయానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన పెంపొందాల్సిన అవసరాన్ని తెలియజేయడంతో పాటు చట్టం ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రం లోని పలు ప్రాంతాలు తరచూ కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తుపాన్లు, సునామీ, వరదలు వంటి విపత్తులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విపత్తులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో 'విపత్తు నిర్వహణ' అంశాన్ని చేర్చేందుకు సిద్ధమైంది. పౌరులకు రాజ్యాంగ హక్కులు- బాధ్యతలు, బుద్ధిమాంద్యం, పర్యావరణం తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం దశలవారీగా 1 నుంచి 6 తరగతుల వరకు కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపొందించింది. ప్రస్తుతం 7 నుంచి 10 వ తరగతి వరకు పుస్తకాలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2011-12లో 7, 9; 2012-13లో 8, 10 తరగతుల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందవచ్చు. - పసుపులో అనేక వైద్య గుణాలు ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. కేన్సర్ చికిత్సలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని ఇపుడు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అయింది. ఈ పరిశోధన బృందానికి భారత సంతతికి చెందిన ఎరి శ్రీవత్సన్ నాయకత్వం వహించటం విశేషం. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థాన్ని సిస్ల్పాటిన్ అనే ఔషధంతో కలిపితే, కేన్సర్ చికిత్సకు ఇచ్చే కీమోథెరపీ సామర్థ్యం పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, మెడ కేన్సర్ చికిత్సలో ఇది సాయపడుతుందని వారు తెలిపారు. పసుపు వాపు, మంటలను తగ్గిస్తుందని రుజువైంది. కొన్ని రకాల కేన్సర్లను అణచివేస్తుందని గతం లో జరిగిన అధ్యయనాల్లోనూ తేలింది. మెదడు, మెడ కేన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఆలస్యంగా గుర్తిస్తే శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ వంటివి ఇవ్వాలి. శ్రీవత్సన్, వాంగ్లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో కర్కుమిన్ ద్వారా మెదడు, మెడ కేన్సర్లు నయమవుతాయని తేలింది. దీనివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు తగ్గుతాయని వివరించారు.
-
కాలం ప్రపంచంలో ప్రతి మనిషికీ రోజుకు 24 గంటలే ఇచ్చింది. గంటకు అరవై నిమిషాలే ఇచ్చింది. ఎక్కడా తేడా లేదు. వివక్ష లేదు. కొందరు మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది ఎలా వాడుకోవాలో తెలియక వృథా చేసుకుంటున్నారు. విజేతకూ పరాజితుడికీ తేడా...సమయపాలన! కాలం కథ ఏమిటో, కాలం మనకు నేర్పించే పాఠాలేమిటో, కాలాన్ని కబళించే సర్పాలేవో ఈ పుస్తకంలో మాచర్ల రాధాకృష్ణమూర్తి చక్కగా విశ్లేషించారు.
- 'అత్యంత విజ్ఞుడైన సలహాదారు కాలం'
- 'రీసైకిల్ చేయలేని ఏకైక వస్తువు దుబారా చేసిన కాలం'
- 'మనం రోజును ఎలా ఖర్చుచేస్తావో, జీవితాన్ని కూడా అలానే ఖర్చుచేస్తాం'...
సమయపాలన
రచన: మాచర్ల రాధాకృష్ణమూర్తి
పేజీలు: 189; వెల: రూ.100/-
ప్రతులకు: ఎం.ఆర్.కె.మూర్తి
హారిక పబ్లికేషన్స్, ప్రకాష్నగర్
నరసరావుపేట, గుంటూరు జిల్లా. -
సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
* 1 ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
* 2 ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
* 3 ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
* 4 ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
* 5 ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
* 6 ఏడ్చే దానికి మొగుడొస్తే నాకూ వస్తాడన్నట్టు
* 7 ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
* 8 ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
* 9 ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
* 10 ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య
* 11 ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
* 12 ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
* 13 ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
* 14 ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
* 15 ఏమండీ కరణం గారూ పాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
* 16 ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి పడుంది
* 17 ఏరు ఏడామడలుండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
* 18 ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు -
'దండన లేని బోధన' పేరిట 10.10.10వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని జూబ్లీ హాలులో హెచ్ఎం టీవీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సదస్సులో వ్యక్తమైన కొన్ని అభిప్రాయాలను ఇక్కడ అందజేస్తున్నాం.
'భయంతో బుద్ధి రాదు - బెత్తం చదువు చెప్పదు' అనే సందేశంతో రూపొందించిన పోస్టర్ను ప్రొఫెసర్ శాంతా సిన్హా ఆవిష్కరించారు. పిల్లలు, పెద్దలు సమానమేనని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను ప్రేమించటంతో పాటు వారిని గౌరవించటం కూడా మనం నేర్చుకోవాలని ఆమె అన్నారు. పిల్లలను కొట్టే హక్కు పెద్దలకు లేదని ఆమె చెప్పారు. కార్పొరల్ పనిష్మెంట్ను విద్యా హక్కు చట్టం నిషేధించిందని ఆమె చెప్పారు.
1990 ప్రాంతాల్లో మానవ హక్కుల చట్టం వచ్చింది. అప్పటి నుంచే మహిళల హక్కులు, బాలల హక్కులు, దళితుల హక్కుల గురించి అందరూ మాట్లాడటం పెరిగింది. ఈ చట్టాలతో సమస్యలు తగ్గుతాయనుకొన్నాను. కానీ చట్టాలు వచ్చినప్పటి నుంచే సమస్యలు మరింతగా పెరిగాయి. ఇందుకు కారణం ఏమిటనేది మనమంతా ఆలోచించాలి.
మాణిక్య వర ప్రసాద్, విద్యా శాఖ మంత్రి
కొట్టక పోతే పిల్లలకు చదువు రాదని తల్లిదండ్రులు కూడ భావిస్తున్నారు. దండిస్తే పిల్లల మేధస్సు పెరగదు. దండనతో విద్యార్థులలో హింసా ప్రవృత్తి పెరుగుతుంది.
ప్రొఫెసర్ హర గోపాల్, జనరల్ సెక్రటరీ, సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ
క్రమ శిక్షణ, శిక్షల మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి.
బాల సుబ్రహ్మణ్యం, డైరెక్టర్, విద్యా శాఖ
లెర్నింగ్ డిజెబిలిటీ ఉన్న పిల్లలకు విద్య నేర్పే ఉపాధ్యాయులు మనకు లేరు. అలాగే పుట్టుకతోనే బహు ముఖ ప్రజ్ఞను కలిగి ఉన్న పిల్లలకు చదువు చెప్పగలిగే ఉపాధ్యాయులూ మనకు లేరు. ఈ రెండు రకాల పిల్లలను హాండిల్ చేయగలగటాన్ని ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. విద్యార్థులందరికీ ఒకేలా మూస పద్థతిలో బోధించే విధానాన్నే మనం అనుసరిస్తున్నాం.
ఇప్పటి విద్య పడగల క్రింద నడుస్తోంది. అది టీచర్లనీ, విద్యార్థులనీ కాటు వేస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారు. తల్లిని తండ్రి కొడుతున్నాడు. కొట్టటం అనేది కుటుంబంలో ఉంది, సమాజంలో ఉంది. అదే బడిలోకి వచ్చింది. దండన లేని సమాజం ఉన్నప్పుడు దండన లేని బడి ఉంటుంది. శిక్షణా? - శిక్షా అనేది హింస లేని సమాజాన్ని ఆవిష్కరించుకొన్నపుడు సాధ్యమవుతుంది.
డాక్టర్ వీరేందర్, క్లినికల్ సైకాలజిస్ట్
బడిలో బడి వాతావరణం లేదు. వసతులూ లేవు. బడిని ఒక పూల తోటలా నిర్వహించాలి.
రాఘవాచారి, మోడల్ టీచర్
ఉపాధ్యాయులనే బాధ్యులను చేయటం సరికాదు
వెంకట రెడ్డి, అధ్యక్షుడు, పిఆర్టియు
ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:30 ఉంటే సర్వ శిక్షా అభియాన్లో చెప్పినట్లు ఆటపాటలతో బోధించటం సాధ్యమవుతుంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులే మొత్తం పాఠశాలను కంట్రోల్ చేయటం కష్టం. దండన వెనుక ఉన్న కారణాలను కనుగొనాలి. ప్రభుత్వమే పరిష్కార మార్గం వెతకాలి.
వెంకటేశ్వర రావు, కార్యదర్శి, ఎపి యుటిఎఫ్
కక్ష తోనో, కసి తోనో ఉపాధ్యాయులు విద్యార్థులను దండించాలని అనుకోరు. ప్రభుత్వ పరంగా సదుపాయాలు, సిబ్బందిని కల్పించక పోవటం ఒక కారణం. రాష్ట్రంలో 1100 మండలాలు ఉంటే 800 మండలాలలో ఎంఇఓలు లేరు.
కె.నర్సింహా రెడ్డి, అధ్యక్షుడు, ఎస్టియు
ఆరేడు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల వద్ద పనిష్మెంట్ రిజిస్టర్ కూడా ఉండేది. విద్యార్థులను ఎలా దండించాలి? ఎక్కడ కొట్టాలి? ఎలా కొట్టాలి వంటి వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేసేవారు. అంటే దండించటం అనే దానికి చట్టబద్ధత అప్పట్లో ఉన్నట్లే కదా?
ఈ పరిస్థితులకు సినిమా, మీడియా, మనం కారణం. మనం ప్రాసెస్ను ఎంజాయ్ చేయకుండా కేవలం రిజల్ట్ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం. సమస్యలకు ఇది ఒక కారణం.
సుబ్బారెడ్డి, అధ్యక్షుడు, ఎపిటిఎఫ్ (1938)
వసతులు లేకపోవటం వల్లనే పిల్లలను కొడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అనటం ఒకరకంగా సోషల్ బ్లాక్ మెయిలింగ్తో సమానం.
ప్రస్తుతం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే రోల్ మోడల్గా నిలవాలి.
సునీల్ కుమార్, నంది అవార్డు గ్రహీత, సొంత ఊరు చిత్ర దర్శకుడు
-
Google announced Google Code-in, an open source development and outreach contest targeted at 13-18 year old students around the world.
Be sure to check out Frequently Asked Questions about the contest for answers to your questions about participating.Google is hopes to get pre-university students from all over the world involved. Google will announce the mentoring organizations that are participating on November 5. The contest starts on November 22, 2010! -
కాలుష్యం కోరల్లో భాగ్యనగరం చిక్కుకొంది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది.వాయు కాలుష్యం హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతున్నదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరానిమెంట్ (సీఎస్ఈ) పేర్కొంది. నగరంలోని వాయు నాణ్యతతోపాటు, రవాణ గణాంకాలను సీఎస్ఈ విశ్లేషించింది. చిన్నపాటి ధూళి కణాలు (పీఎం) ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం హైదరాబాద్లో వాయు నాణ్యత అధమ స్థాయికి చేరిందని సీఎస్ఈ పేర్కొంది. ''పాత నిబంధనల ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాలు ఒక మోస్తరు స్థాయి కాలుష్య ప్రాంతాలుగా వర్గీకరించారు. మారిన నిబంధనల నేపథ్యంలో ఇవి తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా మారిపోయాయి. తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలు అధిక కాలుష్య స్థాయికి చేరాయి'' అని నివేదిక వివరించింది. అక్టోబర్ 7 గురువారం నాడు జరిగిన ఒక రౌండ్టేబుల్ సమావేశంలో సీఎస్ఈ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2003లో సరాసరి వార్షిక పీఎం10 స్థాయి 66 ఎంజీ/సీయూఎం మేర ఉండేది. 2009లో అది 80 ఎంజీ/సీయూఎంకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. అత్యధిక కాలుష్య ప్రాంతంలో ఉండాల్సిన ప్రమాణం కన్నా ఇది 1.3 రెట్లు ఎక్కువని సీఎస్ఈ అసోసియేట్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌధరి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 26లక్షల వాహనాలు ఉన్నాయి. ఏటా 2లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దానితో నగరంలో సరాసరి ప్రయాణ వేగం కూడా తగ్గుతోందని చెప్పారు. 1981లో గంటకు 17 కిలోమీటర్ల మేర వేగం ఉండేదని, 2006లో అది 12 కిలోమీటర్లకు పడిపోయిందని వివరించారు. వాహనాల సంఖ్య పెరగడం వల్లే నగరంలో కాలుష్యం పెరుగుతోందని తెలిపారు.
-
ఆర్కిటిక్లో మంచు పొర తగ్గుతోంది. ఆర్కిటిక్ సముద్ర మంచు వేసవిలో కరుగుతుంది. శీతాకాలంలో మళ్లీ పేరుకోవటం సాధారణమే. అయినా, గత 30 ఏళ్లుగా ప్రమాదకర స్థాయిలో మంచు పొర తగ్గుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వేసవిలో మూడో అత్యల్ప స్థాయికి చేరింది. రాబోయే 20-30 ఏళ్లలో వేసవి సమయంలో ఆర్కిటిక్ మంచురహిత ప్రాంతంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేసవి సీజన్లో మంచు కరిగే ముప్పు పెరుగుతోందని కొలరాడోలోని జాతీయ మంచు గణాంక కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
పట్టాలపై ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా నిరోధించే పరికరం సిద్ధమైందని రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. త్వరలో దానిని అందుబాటులోకి తేనున్నామని మమతా బెనర్జీ తెలిపారు. దీంతోపాటు అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థనూ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఇవి రెండూ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అక్టోబర్ 7 వ తేదీన ఆమె ఒక సమావేశంలో వెల్లడించారు. - చంద్రుడిపైకి చైనా మరో ఉపగ్రహాన్ని పంపింది. ఛాంగే-2 అనే ఈ ఉపగ్రహాన్ని సిచువన్ ప్రాంతంలోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంనుంచి ప్రయోగించారు. ఉపగ్రహం ప్రయోగించిన 20 నిమిషాల్లో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఐదు రోజుల్లో చంద్రుని కక్ష్యా వేగాన్ని అందుకుంటుందన్నారు. ఉపగ్రహాన్ని 54.84 మీటర్ల పొడవు, 345 టన్నుల బరువున్న 3సీ రాకెట్తో ప్రయోగించినట్లు చెప్పారు. 2013లో చంద్రుడిపైకి మానవుడిని పంపాలని చైనా లక్ష్యంగా నిర్ణయించింది.
-
మూడేళ్లలో 31 కోట్ల మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో, రూ.500 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని పచ్చగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. మూడేళ్లలో ప్రతి గ్రామ పంచాయితీలో 17 వేల మొక్కలను నాటే కార్యక్రమం కార్యరూపం దాల్చబోతోంది. మొత్తంమీద 31 కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు చేపట్టబోతున్నాయి. రాష్ట్రంలోని 65 లక్షల హెక్టార్ల అడవుల్లో దాదాపు 30 లక్షల హెక్టార్లలో అడువులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చని వనాలను పెంపొందించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖకు రూ.500 కోట్లను కేటాయించారు. మహాత్మాగాంధీ గ్రామీణ నర్సరీ పేరిట ప్రతి మండలంలో నాలుగు నర్సరీల చొప్పున మొత్తం 4,604 నర్సరీలను ఏర్పాటుచేస్తారు. ప్రతి నర్సరీలో 70 వేల నుంచి 80 వేల మొక్కల్ని పెంచుతారు. టేకు, నీలగిరి, వెదురు, నేరేడు, తుమ్మ, ఎర్రచందనం, ఉసిరి, కానుగ, వేప, సుబాబుల్ మొక్కలను పెంచుతారు. ప్రతి నర్సరీకి ఒక వనసేవక్, 20 నర్సరీలకు ఒక పోగ్రాం అసిస్టెంటెంట్లను నియమించనున్నారు. నిర్ణయించిన కొలతలతో గొయ్యి తీసి బంజరు భూముల్లో గానీ, రోడ్డు పక్కన గానీ మొక్కలు ఎవరు నాటినా ఉపాధి హామీ పథకం కింద నిధులను వీరికి అందజేయనున్నారు. చెరువుల పూడికతీతతో పాటు ఇతరత్రా ఉపాధి పనుల్లాగే దీన్ని కూడా ఉపాధి పథకంలోకి తీసుకువచ్చి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొక్కలు నాటాక వీటి సంరక్షణ బాధ్యతను డివిజనల్ ఫారెస్టు అధికారులతో పాటు జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ అధికారులు చేపడతారు.
-
భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, బ్రిటన్ యువరాజు చార్లెస్ చేతుల మీదుగా కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ అద్భుత ఘట్టానికి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. 28 ఏళ్ల కింద ఆసియా క్రీడలను నిర్వహించిన భారత్ ఇపుడు కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది. ౩ అక్టోబరు సాయంత్రం వేళ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రూ.44 కోట్లతో ఏర్పాటుచేసిన బెలూన్ ఆకారపు ఏరోస్టాట్ తెరను ఆకాశంలోకి ఎత్తగానే ప్రాంగణమంతా స్వర్ణకాంతులు పరచుకున్నాయి. కామన్వెల్త్ దేశాల అధినేత ఎలిజబెత్ రాణి తరఫున బ్రిటన్ యువరాజు ఛార్లెస్, భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్టేడియంలోని 60 వేలమంది ప్రేక్షకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ క్రీడల్ని బ్రిటిష్ రాణి ప్రారంభించకపోవడం గత 44 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి. యువరాజు ఛార్లెస్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఏకకాలంలో ఈ క్రీడల్ని ప్రారంభించాలన్న దౌత్యపరమైన ఒప్పందం మేరకు ఆదివారం ఒకే వేదికపై నుంచి ఇరువురూ క్రీడల ప్రారంభ సూచకంగా ప్రకటన చేశారు.
ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జాక్విస్ రోగ్, భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. సంస్కృతి, ఆధునికత కలగలిసిన కార్యక్రమాలు 2 గంటలపాటు ప్రేక్షకుల్ని కట్టిపారేశాయి. 70 వేల కోట్ల రూపాయల ఈ మెగా కార్యక్రమం ఇది. పన్నెండు రోజులపాటు జరిగే క్రీడా పండుగలో 71 దేశాలకు చెందిన ఏడువేల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
1050 మంది పాఠశాల విద్యార్థుల నమస్తే నృత్య ప్రదర్శనను 23 భారతీయ భాషల్లో ఏరోస్టాట్లో ఆవిష్కరించారు. క్రీడాకారుల పెరేడ్ 71 మంది మహిళలతో ప్రారంభమైంది. అంతా చీరలు కట్టుకొని భారతీయతను, చీరల రంగుల్లో వారివారి దేశాల పతాకాలను ప్రతిబింబించారు. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న అభినవ్ బింద్రా సారథ్యంలో 619 మంది సభ్యుల భారత బృందం ప్రాంగణంలోకి వచ్చినపుడు కేరింతలు కొట్టారు. 71 దేశాల క్రీడాకారుల మార్చ్ సాగింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్, బాక్సింగ్ వీరుడువిజేందర్సింగ్, కుస్తీ యోధుడు సుశీల్ కుమార్లు బ్యాటన్ను మోసిన వారిలో ఉన్నారు. అనంతరం అన్ని దేశాల పతాకాలు ప్రాంగణంలోకి రాగా, భారత కెప్టెన్ బింద్రా ప్రమాణస్వీకారం చేశారు. 816 మంది ప్రదర్శనకారులు చేసిన సూర్య నమస్కారాలు, క్లిష్టమైన ఆసనాలు అలరించాయి. -
కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
విప్పితే: కనురెప్పలు!
ల జవాబులు
మామ కాని మామ, ఎవ్వరది?
విప్పితే: చందమామ!
చుట్టింటికి మొత్తే లేదు
జవాబు: కోడి గుడ్డు
నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు
అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు
అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
జవాబు: పెదవులు
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!
తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి
దేశదేశాలకు ఇద్దరే రాజులు
జవాబు: సూర్యుడు, చంద్రుడు
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
జవాబు: తేనెపట్టు
తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
జవా:ఉత్తరం
ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
జవాబు: టెంకాయ
అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
జవాబు: తేనె పట్టు
తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
జవాబు: పుస్తకంలో అక్షరాలు
వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
జవాబు: పొలం గట్టు
ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు
పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్
మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.
జవాబు:తుపాకి/తూట
మూడు కళ్ళ ముసలిదాన్ని
నేనెవరిని?
జవాబు:తాటి ముంజ
బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.
జవాబు:దానిమ్మ పండు.
పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
జవాబు:తన నీడ
మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య.
జవాబు:చెప్పులు
పలుకుగాని పలుకు :
ఎమిటది?
జవాబు:వక్క పలుకు
నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది?
జవాబు:పాపిడి.
పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు
జవాబు:పనస పండు
పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
జవాబు:మొగలి పువ్వు
నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు:దీపం వత్తి
అక్కడిక్కడి బండి అంతరాల బండి:
మద్దూరి సంతలోన మాయమైన బండి.
ఏమిటది?
జవాబు:సూర్యుడు.
అడవిని పుట్టాను,
నల్లగ మారాను:
ఇంటికి వచ్చాను,
ఎర్రగ మారాను:
కుప్పలో పడ్డాను,
తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది:
చెంబులో నీళ్ళని,
చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ?
జవాబు:గడప
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది,
తైతక్కలాడింది.
ఎవరు?
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు.
అన్నదమ్ములం ముగ్గురం మేము,
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:
అయితే బుద్ధులు వేరు --
నీళ్ళలో
మునిగే వాడొకడు:
తేలే వాడొకడు;
కరిగే వాదొకడు:
అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.
అమ్మ కడుపున పడ్డాను,
అంత సుఖమున్నాను:
నీచే దెబ్బలు తిన్నను,
నులువునా ఎండిపోయాను:
నిప్పుల గుండం తొక్కాను:
గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక
ఆకసమంతా అల్లుకు రాగా:
చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ
ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జవాబు:కల్లు
ఆమడ నడిచి అల్లుడొస్తే,
మంచం కింద ఇద్దరూ,
గోడ మూల ఒకరూ,
దాగుకున్నారు.
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర
ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం
ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.
ఇక్కడి నుంచి చూస్తే యినుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండు;
తింటే తీయగనుండు.
జవాబు: తాటిపండు.
ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం
ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చెప్పులు
ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చీపురు
ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
జవాబు: మిరపచెట్టు.
ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు.
జవాబు: ఇంద్రధనస్సు
తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.
జవాబు: పనసకాయ
గోడమీద బొమ్మ
గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారికి
వడ్డించు బొమ్మ.
జవాబు: తేలు.
చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
జవాబు: టెంకాయ .
ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
జవాబు: సైకిలు డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ? జవాబు: దానిమ్మ కాయ.
పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
జవాబు: దీపం
అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
జవాబు:పెదవులు
నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు
వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
జవాబు : గాలిపటం
మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు
చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబు: నాగలిదున్నే రైతు/-------- ( ఒంకర టింకర -అ, వాని తమ్ముడు -సొ,నల్లగుడ్ళ-- మి, నాలుగు కాళ్ళ--మె,) - భూమి లాంటి గ్రహం మరొకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక తార చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి గ్లీస్ 581జీ అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమి కంటే 3 రెట్లు పెద్దగా ఉంది. ఈ గ్రహంపై రాత్రి, పగలు ఉండవు. ఈ గ్రహం పై భూమి తరహాలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవం మనగడకు అనువైన పరిస్థితులూ ఉన్నాయని నీరూ ఉండొచ్చని చెప్పారు. హవాయ్లోని డబ్ల్యూఎం కెక్ అబ్జర్వేటరీలో 11 ఏళ్ల పాటు పరిశీలనలు జరిపి ఈ గ్రహం తీరుతెన్నులను గమనించారు.
-
గణితశాస్త్రంలో వృత్తం చుట్టుకొలత, వ్యాసం నిష్పత్తినే 'పై' అంటారు. దీనిని 22/7గా పేర్కొంటారు. 'పై'ని ఎంత భాగించినా శేషం వస్తూనే ఉంటుందని మనకు తెలుసు. జపాన్కు చెందిన ఒక ఇంజినీర్ సొంతంగా రూపొందించిన కంప్యూటర్ను ఉపయోగించి 'పై' విలువను ఐదులక్షల కోట్ల (ఐదు ట్రిలియన్లు) వరకూ లెక్కించారు. ఒక ఫ్రెంచి ఇంజినీర్ గత ఏడాది నమోదు చేసిన రికార్డును (2.7 ట్రిలియన్లు) బద్దలు కొట్టారు. ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో ఇంజినీర్గా పని చేస్తున్న షిగెరు కొండొ 'పై' విలువను వీలైనన్ని ఎక్కువ స్థానాల వరకూ లెక్కించటానికి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం 32 టెరాబైట్ల హార్డ్డ్రైవ్తో సొంతంగా కంప్యూటర్ను తయారుచేశారు. అనంతరం 5ట్రిలియన్ల స్థానాలవరకూ పై విలువను లెక్కించారు. -
నేనూ పెద్దవాడినయితే
పక్క ఇంటి పిల్లవాడు
'బాబ్జీ' అంతవుతా!
వాడివెంట నేను కూడ బడికిపోయి చదువుతా !
పలకమీద అకరాలు పట్టి పట్టి దిద్దుతా !
అచ్చు లాగా రాసుకొచ్చి అమ్మకు చూపిస్తా !
'అల,వల, తల, కల' అన్ని పేర్లు చదువుతా!
అడగగానే మేష్టారికి అప్పచెప్పి తీరుతా !
ఎంత పెద్ద పద్యమైన అంతలోనె వల్లిస్తా !
తడబడకుండా వడిగా తరగతిలో పాడుతా !
గుక్క తిప్పకుండ నేను ఎక్కాలను చదువుతా !
ఒక్క తప్పు లేకుండా లెక్కలన్ని చేస్తా !
నేను పెద్ద పరీక్షలకు నిద్రమాని చదువుతా !
పట్టు పట్టి తరగతిలో
ఫస్టున ప్యాసవుతా ! -
782474317884...ఈ పన్నెండంకెల సంఖ్య - కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆధార్' ప్రాజెక్టులో భాగంగా జారీ చేసిన మొట్టమొదటి విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్య. మహారాష్ట్రకు చెందిన రజనా సోనావానే అనే గిరిజన మహిళకు ఈ సంఖ్యను కేటాయించారు. దీంతో రజనా దేశంలోనే మొదటి విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందిన మహిళగా నిలిచారు. ఈ సంఖ్యే ఆమెకు జీవితాంతం అధికారిక గుర్తింపుగా ఉండిపోతుంది. ఇదే విధంగా భారత దేశం లోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్యను కేటాయించనున్నారు.ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీలు 29 సెప్టెంబర్ న నందర్బార్ జిల్లాలోని తెంబ్లీ గిరిజన గూడెంలో 'ఆధార్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్డుల రూపశిల్పి 'యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' చీఫ్ నందన్ నిలేకని కూడా పాల్గొన్నారు. ''చాలామంది పేదలకు ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవు. దీంతో వారు బ్యాంకులో ఖాతా తెరవడానికైనా, రేషన్ పొందడానికైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధినీ పొందలేకపోతున్నారు. అవన్నీ దారిమళ్లి దళారులు, ఇతరుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ కార్డులతో ఆ సమస్యలు తొలగుతాయి'' అని ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. -
-
పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.
మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.
ఇక్కడ కొన్ని పొడుపు కథలు ఇస్తున్నాం. వీటిని విప్పే ప్రయత్నం చేయండి.
1 కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
2 మామ కాని మామ, ఎవ్వరది?
3 చుట్టింటికి మొత్తే లేదు
4 నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
5 అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
6 అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
7 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
8 తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
9 దేశదేశాలకు ఇద్దరే రాజులు
10 చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
11 తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
12 ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
13 అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
14 తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
15 వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
16 ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
17 పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
18 మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత.
19 మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
20 బంగారు భరిణలో రత్నాలు: పగుల గొడితేగాని రావు.
21 పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
22 మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య.
23 పలుకుగాని పలుకు :ఎమిటది?
24 నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది?
25 పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు
26 పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది: తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
27 నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
28 అక్కడిక్కడి బండి అంతరాల బండి: మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది?
29 అడవిని పుట్టాను, నల్లగ మారాను: ఇంటికి వచ్చాను, ఎర్రగ మారాను: కుప్పలో పడ్డాను, తెల్లగ మారాను.
30 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుంది.
31 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి. ఎవరు ?
32 అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు -- నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాదొకడు: అయితే మే మెవరం?
33 అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
34 ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
35 ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
36 ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ,దాగుకున్నారు.
37 ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
38 ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
39 ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు.
40 ఊరంతకీ ఒక్కటే దుప్పటి
41 ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
42 ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
43 ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి.
44 ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
45 ఏడుగురు అన్నదమ్ములం మేము;విడివిడిగా వుంటే చెప్పలేవు ,కలసి వుంటే చెప్పగలవు.
46 తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు.
47 గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ.
48 చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
49 ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
50 పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
51 అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
52 నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
53 వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచుఅంబరమున దిరుగు నది యేమిచోద్యమో
54 మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారుచెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబుల కోసం ఇక్కడ చూడండి. -
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా హోంవర్క్ను, యూనిట్ టెస్ట్లను కుదించుకోవాలని నిర్ణయించిన సీబీఎస్ఈ బోర్డు మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన కంటిన్యువస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్(సీఎస్ఈ) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విషయంలో ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా విభిన్న వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శిక్షకులను, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను తయారు చేయాలని నిర్ణయించింది. తమ ప్రాజెక్టు వర్క్ల్లో మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా, ఇచ్చిన పనుల్లో మరింతగా లీనమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కృషి చేస్తారు. అలాగే, తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు నెరపుతూ పిల్లలపై వారిలో ఉన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. -
విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే 70లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు.
బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్ టూ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి. -
ఇంటర్నెట్ వీక్షణలో పీసీలను వెనక్కు నెట్టి సెల్ఫోన్లు ముందంజ లోకి చేరుకున్నాయి. నిన్న గాక మొన్న వచ్చిన సెల్ఫోన్లు ఇంటర్నెట్ వీక్షణలో పీసీలను వెనక్కు నెట్టేస్తున్నాయి. కేవలం ఫోన్ సంభాషణ జరపడం, ఎస్సెమ్మెస్లు పంపడం అన్న పరిధి నుంచి సెల్ఫోన్ లు విస్తరించి పీసీల పనిని కూడా చేస్తున్నాయి.
తాజాగా జరిపిన ఓ సర్వే ప్రకారం ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నెటిజన్లు పీసీల కంటే కూడా సెల్ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారని వెల్లడైంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం, వార్తలు చదువుకోవడం, క్రీడా వార్తలు తెలుసుకోవడం, సోషల్నెట్వర్కింగ్ సైట్లను వీక్షించడం వంటి రోజువారీ అవసరాలకు పీసీల కంటే కూడా సెల్ఫోన్ల మీదే ఎక్కువ మంది నెటిజన్లు ఆధారపడుతున్నారని సర్వేలో తెలిసింది. రెండేళ్ల క్రితం మార్కెట్లోకి ఐఫోన్ వచ్చినప్పటి నుంచీ ఈ పరిస్థితి పెరిగిందన్నారు. ఇంటర్నెట్ను వీక్షించే మూడు పదుల వయసు వారిలో సగానికి పైగా సెల్ఫోన్ పైనే ఆధారపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. వారి వద్ద పీసీలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా నెట్ బ్రౌజింగ్ కోసం సెల్ఫోన్ల మీదే వీరు ఆధారపడుతున్నట్లు సర్వేలో తెలిసింది. -
భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ధ్రువీకరణ బాటిళ్లలో విక్రయించే మంచినీటికి తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ఆహార శాఖ స్పష్టం చేసింది. మినరల్ వాటర్తో సహా బాటిళ్లలో విక్రయించే అన్ని రకాల మంచినీళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ''మంచినీటి తయారీ, విక్రయం, ప్రదర్శన - వీటిలో ఏది చేయాలన్నా ఆ నీటికి బీఐఎస్ ప్రమాణాల ధ్రువీకరణ తప్పనిసరి'' అని ఆహారశాఖ పేర్కొన్నది. సాధారణ తాగునీటికి ఐఎస్ 14543:2004 ప్రమాణాలను, మినరల్ వాటర్కు 13428:2005 ప్రమాణాలను పాటించాలని తెలిపింది. మినరల్ వాటర్కు సంబంధించి 18 కంపెనీలకు, రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మంచినీటిని విక్రయిస్తున్న సంస్థలకు 2,354 లైసెన్సులు ఉన్నాయని, సహజసిద్ధంగా లభిస్తున్న మంచినీటిని విక్రయించేందుకు 633 లైసెన్సులు ఉన్నాయని పేర్కొంది. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. -
రెక్కలు కట్టుకొని పిట్టలా వినీలాకాశంలో విహరించాలనుకొనే కల నిజమౌతున్నది. కెనడా శాస్త్రవేత్త అలాంటి ఓ విహంగ విమానాన్ని కనుగొన్నాడు. యంత్రాలతో నిమిత్తం లేకుండా మనం రెక్కలు అల్లార్చుతూ పక్షిలా గాల్లో ఎంచక్కా గిరికీలు కొట్టేయవచ్చు. టొరాంటోలో పీహెచ్డీ చేస్తున్న టాడ్ రీషెర్ట్ రూపొందించిన ఈ విహంగ విమానం పేరు 'స్నోబర్డ్'. మనమే దీని మార్గాన్ని, వేగాన్ని నియంత్రించుకోవాలి. కాళ్లతో పెడలింగ్చేస్తే దీని రెక్కలు పైకి కిందికీ కదులుతాయి.'స్నోబర్డ్' గాలిని ఛేదించుకుంటూ ముందుకు తీసుకెళుతుంది. ఈ రెక్కలను చకచకా కదిలే కప్పీలు, తాళ్లసాయంతో పెడల్కు కలపటం వల్ల పెడలింగ్ చేసినపుడు ఇవి వేగంగా కదులుతాయి. టాడ్ ప్రయోగాత్మకంగా దీన్నినడిపి 145 మీటర్ల దూరాన్ని 19.3 సెకండ్లలో చేరుకున్నాడు. -
'ప్లాస్టిక్ స్థానంలో బట్ట సంచులను వినియోగించండి. పర్యావరణాన్ని కాపాడండి. 'పచ్చదనం-పరిశుభ్రతను సాధించండి' అనే ఈ నినాదంతో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. 'ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్', 'గ్రీన్ ఆర్కిటెక్ట్స్ అండ్ ప్లానర్స్' సంస్థలతో కలిసి బట్ట సంచుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యపరచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేయనున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో ముందుగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పల్లెల్లో సైతం కొనసాగుతాయి.
-
The total number of registered newspapers, as on 31st March, 2008: 69,323
The number of new newspapers registered during 2007-08: 4,332
Percentage of growth of total registered publications over the previous year: 6.7 %
The largest number of newspapers & periodicals registered in any Indian language (Hindi): 27,527
The second largest number of newspapers & periodicals registered in any language (English): 10,000
The state with the largest number of registered newspapers (Uttar Pradesh):10,779
The state with the second largest number of registered newspapers (Delhi): 9,483
The number of newspapers that submitted Annual Statements: 9,072
The total circulation of newspapers : 20,71,08,115
The largest number of newspapers & periodicals that submitted Annual Statements in any Indian language (Hindi): 4,962
The second largest number of newspapers & periodicals that submitted Annual Statements in any language (English) : 971
The largest circulated Daily: The Hindu,English,Chennai : 12,75,553
The second largest circulated Daily: Ananda Bazar Patrika,Bengali,Kolkata : 12,55,850
The third largest circulated Daily: Eenadu,Telugu,Hyderabad : 11,81,844
The largest circulated multi-edition Daily: The Times of India, English(5 editions):23,35,991
The second largest circulated multi-edition Daily: Eenadu,Telugu,(23 editions):22,27,025
The largest circulated periodical: The Hindu Weekly,English, Chennai : 11,28,569 - 'ఆల్పైన్ పెన్నీక్రెస్' మొక్కను బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నివారణకు వాడవచ్చంటున్నారు ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన డాక్టర్ గెయిల్ ప్రెస్టన్. వీటి ఆకులకు అద్భుత ఔషధ గుణాలున్నట్లు వారు చెబుతున్నారు. 'ఆల్పైన్ పెన్నీక్రెస్' అడవిపూల మొక్క ఆకులన్నీ జింక్, నికెల్, కాడ్మియం వంటి ఖనిజాల సమ్మిళితం. ఈ ఆకులు అంటు వ్యాధులను నివారించే రక్షణ కవచాల్లాంటివి. ఆవమొక్కల కుటుంబానికి చెందిన ఈ మొక్కను 'ఆల్పైన్ పెన్నీక్రెస్' గా వ్యవహరిస్తున్నారు. ఐరోపా, బ్రిటన్లలో ఏపుగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకప్పుడు మైనింగ్ బాగా జరిగిన ప్రాంతాల్లోనే ఇవి అధికంగా కనిపిస్తున్నాయని డాక్టర్ గెయిల్ ప్రెస్టన్ వెల్లడించారు.
-
- అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్(ఎన్ఐసీ), యూరోపియన్ యూనియన్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ (ఈయూఐఎస్ఎస్) సంయుక్తంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితా ప్రకారం మొదటి రెండు స్థానాలు అమెరికా, చైనాకు దక్కాయి. దీని ప్రకారం గ్లోబల్ పవర్లో అమెరికా 22 శాతం, యూరోపియన్ యూనియన్ 16 శాతం, చైనా 12 శాతం, భారత్ 8 శాతం వాటా సాధించాయి. 2025 నాటికి చైనా, భారత్, బ్రెజిల్ మరింత బలోపేతం అవుతాయి. భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచం గుర్తిస్తోందని అనేందుకు ఇది ఒక ఉదాహరణ.
-
హ్రస్వ దృష్టి కారక జన్యువుని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కనిపించే ఈ రుగ్మతను నయం చేయడానికి కొత్త తరహా చికిత్స విధానాలను రూపొందించడానికి ఈ పరిశోధన అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారి కంట్లో రెటీనాను చేరక ముందే దృశ్యాలు ఏర్పడతాయి. దీనివల్ల దూరంలో ఉన్న వస్తువులు మసకగా కనపడతాయి.
కాగా ఈ విషయానికి సంబంధించి లండన్ లోని కింగ్స్ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆర్ఏఎస్జీఆర్ఎఫ్1 అనే జన్యువును గుర్తించింది. ఇది కన్ను వృద్ధిలోను, దృశ్యరూప సంకేతాలను మెదడుకు చేరవేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తేల్చారు. - ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో మన దేశం నాలుగో స్థానం లో నిలిచింది. ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల నెటిజన్లు మన దేశం లో ఉన్నారని ఒక అధ్యయనం లో వెల్లడైంది. మరో మూడేళ్లలో జపాన్ను మనం దాటి పోతామని అంచనా. ఈ లెక్కలు, అంకెలు ఘనంగానే ఉన్నా పల్లెల విషయానికొచ్చే సరికి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. దేశమంతా కలిపి కేవలం యాభై నాలుగు లక్షల గ్రామీణ నెటిజన్లున్నారు. 2008లో ముప్ఫై మూడు లక్షలున్న ఆ సంఖ్య రెండేళ్లు గడిచేసరికి యాభై నాలుగు లక్షలైంది. ఇది ఒక్క ముంబై నగరంలోని నెటిజన్లకన్నా తక్కువే. ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐ.ఎ.ఎం.ఎ.ఐ), ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎం.ఆర్.బి.) సంయుక్త సర్వేలో ఈ విషయాలు తేలాయి.
-
వీడియోగేమ్లతో పిల్లల్లో చలాకీతనం పెరుగుతుందా? అవుననే అంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. వీడియోగేమ్లతో పిల్లలు సమయాన్ని వృథాచేస్తున్నారని పెద్దలు అనటం మనకు తెలిసిన విషయమే. వీడియోగేములు వారి చదువులు పాడుచేస్తున్నాయని నిందలున్నా, పిల్లలు సకాలంలో సరైన నిర్ణయం తీసుకునే శిక్షణ సాధనంగా అవి ఉపకరిస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడయింది.
ముఖ్యంగా పోరాట సన్నివేశాలుండే వీడియోగేమ్లు ఆడే పిల్లల్లో తమ చట్టూ ఏం జరుగుతుందో సునిశితంగా పసిగట్టే నైపుణ్యం, కచ్చితమైన, వేగవంతమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరగడానికి అవి దోహదం చేస్తున్నట్లు న్యూయార్క్లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
చౌమొహల్లా ప్యాలెస్కు యునెస్కో హెరిటేజ్ మెరిట్ అవార్డు లభించింది. హైదరాబాద్ రాజధానిలోని చారిత్రక చార్మినార్ సమీపంలోని
'చౌమొహల్లా ప్యాలెస్' మరోమారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ రాజప్రాసాదానికి 'యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్
మెరిట్ అవార్డు' లభించింది. ఆసఫ్జాహీ పాలకుల అధికార భవనంగా చరిత్రకెక్కిన ఈ ప్యాలెస్ను దేశ విదేశాల ప్రముఖులు సందర్శించి ముగ్ధులయ్యారు. మూడు నెలల క్రితం ప్యాలెస్ అధికారులు ఈ అద్భుత కట్టడ విశిష్టత, పరిరక్షణ ఫొటోలను యునెస్కో హెరిటేజ్ అవార్డు నిమిత్తం కమిటీకి పంపారు. మరో 13 దేశాలు కూడా పోటీపడ్డాయి. కాగా చౌమొహల్లా ప్యాలెస్కు అవార్డు వరించింది. బ్యాంకాక్లోని పది మంది సభ్యుల కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. -
పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రంలో తల్లి పేరును కూడా ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాదరావుకు అందిన విజ్ఞప్తులపై పరిశీలన జరిపిన ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మార్కుల ధ్రువీకరణ పత్రంలో ప్రస్తుతం తండ్రి పేరును మాత్రమే ముద్రిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం తండ్రి పేరుతోపాటు తల్లి పేరును కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లిపేరు మాత్రమే ఉండాలని కోరుకున్నా కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. తండ్రి పేరు మాత్రమే ఉండాలని కూడా విద్యార్థి కోరుకోవచ్చు.
వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పరీక్షల కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు తమ దరఖాస్తుల్లో తల్లి పేరు కావాలా, తండ్రి పేరు కావాలా లేక ఇద్దరి పేర్లు కావాలా అన్నది స్పష్టంగా పేర్కొనాలి. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. -
మన దేశానికి 11వ భారత రాష్ట్రపతి గా (జూలై 25, 2002 – జూలై 25, 2007) చేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలామ్ . అక్టోబర్ 15 1931 న తమిళనాడు రాష్ట్రం లోని ధనుష్కోడి, రామేశ్వరంలో అబ్దుల్ కలామ్ జన్మించారు. సాధారణంగా ఏ. పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్. అంతే గాక ఆయన భారత దేశపు ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఇంజనీరు కూడా.(1931-10-15)
చిన్ననాటి విశేషాలు
"ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్కి వెళ్లేవాడ్ని. స్నానం చేసిన రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు.'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి'
ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం
తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు.
ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958 లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగు లో పట్టా పుచ్చుకున్నాడు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరాడు. 1962 లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రో కు మారాడు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.1982 లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992 లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.
భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్.జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన మెజారిటీతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశాడు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది . తాను తిరుక్కురళ్ లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన దాదాపు తను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం " నైనా ప్రస్తావిస్తాడు.
కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నాడు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నాడు.ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్నిఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశాడు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తాడు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం. -
సంఖ్య పేరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1 సి.ఎం.త్రివేది 01/11/1953 31/07/1957 2 భీమసేన్ సచార్ 01/08/1957 07/09/1962 3 జనరల్. ఎస్.ఎం.శ్రీనగేష్ 08/09/1962 03/05/1964 4 పీ.ఏ.థాను పిల్లై 04/05/1964 10/04/1968 5 ఖాండూభాయి కసాంజీ దేశాయి 11/04/1968 25/01/1975 6 జస్టిస్ ఎస్.ఓబులరెడ్డి 25/01/1975 09/01/1976 7 మెహనలాల్ సుఖాడియా 10/01/1976 15/06/1976 8 ఆర్.డీ.భండారీ 16/06/1976 16/02/1977 9 జస్టిస్ బీ.జె.దివాన్ 17/02/1977 04/05/1977 10 శారద ముఖర్జీ 05/05/1977 14/08/1978 11 కె.సి.ఆబ్రహాం 15/08/1978 14/08/1983 12 రామ్ లాల్ 15/08/1983 29/08/1984 13 డా. శంకర్ దయాళ్ శర్మ 29/08/1984 26/11/1985 14 కుముద్ బెన్ జోషి 26/11/1985 07/02/1990 15 కృష్ణకాంత్ 07/02/1990 21/08/1997 16 జి.రామానుజం 22/08/1997 23/11/1997 17 డా. సి.రంగరాజన్ 24/11/1997 02/01/2003 18 సుర్జీత్ సింగ్ బర్నాలా 03/01/2003 03/11/2004 19 సుషీల్ కుమార్ షిండే 04/11/2004 29/01/2006 20 రామేశ్వర్ ఠాకూర్ 29/01/2006 19/08/2007 21 నారాయణదత్ తివారీ 19/08/2007 26/12/2009 22 ఈ.ఎస్.ఎల్.నరసింహన్ డిసెంబర్ 26, 2009