పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రంలో తల్లి పేరును కూడా ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాదరావుకు అందిన విజ్ఞప్తులపై పరిశీలన జరిపిన ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మార్కుల ధ్రువీకరణ పత్రంలో ప్రస్తుతం తండ్రి పేరును మాత్రమే ముద్రిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం తండ్రి పేరుతోపాటు తల్లి పేరును కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లిపేరు మాత్రమే ఉండాలని కోరుకున్నా కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. తండ్రి పేరు మాత్రమే ఉండాలని కూడా విద్యార్థి కోరుకోవచ్చు.
వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పరీక్షల కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు తమ దరఖాస్తుల్లో తల్లి పేరు కావాలా, తండ్రి పేరు కావాలా లేక ఇద్దరి పేర్లు కావాలా అన్నది స్పష్టంగా పేర్కొనాలి. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
0 comments:
Post a Comment