ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రం లోని పలు ప్రాంతాలు తరచూ కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తుపాన్లు, సునామీ, వరదలు వంటి విపత్తులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విపత్తులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో 'విపత్తు నిర్వహణ' అంశాన్ని చేర్చేందుకు సిద్ధమైంది. పౌరులకు రాజ్యాంగ హక్కులు- బాధ్యతలు, బుద్ధిమాంద్యం, పర్యావరణం తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం దశలవారీగా 1 నుంచి 6 తరగతుల వరకు కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపొందించింది. ప్రస్తుతం 7 నుంచి 10 వ తరగతి వరకు పుస్తకాలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2011-12లో 7, 9; 2012-13లో 8, 10 తరగతుల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందవచ్చు.
0 comments:
Post a Comment