782474317884...
ఈ పన్నెండంకెల సంఖ్య - కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆధార్' ప్రాజెక్టులో భాగంగా జారీ చేసిన మొట్టమొదటి విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్య. మహారాష్ట్రకు చెందిన రజనా సోనావానే అనే గిరిజన మహిళకు ఈ సంఖ్యను కేటాయించారు. దీంతో రజనా దేశంలోనే మొదటి విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందిన మహిళగా నిలిచారు. ఈ సంఖ్యే ఆమెకు జీవితాంతం అధికారిక గుర్తింపుగా ఉండిపోతుంది. ఇదే విధంగా భారత దేశం లోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్యను కేటాయించనున్నారు.
ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీలు 29 సెప్టెంబర్ న నందర్బార్ జిల్లాలోని తెంబ్లీ గిరిజన గూడెంలో 'ఆధార్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్డుల రూపశిల్పి 'యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' చీఫ్ నందన్ నిలేకని కూడా పాల్గొన్నారు. ''చాలామంది పేదలకు ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవు. దీంతో వారు బ్యాంకులో ఖాతా తెరవడానికైనా, రేషన్ పొందడానికైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధినీ పొందలేకపోతున్నారు. అవన్నీ దారిమళ్లి దళారులు, ఇతరుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ కార్డులతో ఆ సమస్యలు తొలగుతాయి'' అని ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు.
0 comments:
Post a Comment