ఇంటర్నెట్ వినియోగంలో మనది నాలుగో స్థానం
ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో మన దేశం నాలుగో స్థానం లో నిలిచింది. ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల నెటిజన్లు మన దేశం లో ఉన్నారని ఒక అధ్యయనం లో వెల్లడైంది. మరో మూడేళ్లలో జపాన్ను మనం దాటి పోతామని అంచనా. ఈ లెక్కలు, అంకెలు ఘనంగానే ఉన్నా పల్లెల విషయానికొచ్చే సరికి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. దేశమంతా కలిపి కేవలం యాభై నాలుగు లక్షల గ్రామీణ నెటిజన్లున్నారు. 2008లో ముప్ఫై మూడు లక్షలున్న ఆ సంఖ్య రెండేళ్లు గడిచేసరికి యాభై నాలుగు లక్షలైంది. ఇది ఒక్క ముంబై నగరంలోని నెటిజన్లకన్నా తక్కువే. ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐ.ఎ.ఎం.ఎ.ఐ), ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎం.ఆర్.బి.) సంయుక్త సర్వేలో ఈ విషయాలు తేలాయి.
0 comments:
Post a Comment