'భయంతో బుద్ధి రాదు - బెత్తం చదువు చెప్పదు' అనే సందేశంతో రూపొందించిన పోస్టర్ను ప్రొఫెసర్ శాంతా సిన్హా ఆవిష్కరించారు. పిల్లలు, పెద్దలు సమానమేనని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను ప్రేమించటంతో పాటు వారిని గౌరవించటం కూడా మనం నేర్చుకోవాలని ఆమె అన్నారు. పిల్లలను కొట్టే హక్కు పెద్దలకు లేదని ఆమె చెప్పారు. కార్పొరల్ పనిష్మెంట్ను విద్యా హక్కు చట్టం నిషేధించిందని ఆమె చెప్పారు.
1990 ప్రాంతాల్లో మానవ హక్కుల చట్టం వచ్చింది. అప్పటి నుంచే మహిళల హక్కులు, బాలల హక్కులు, దళితుల హక్కుల గురించి అందరూ మాట్లాడటం పెరిగింది. ఈ చట్టాలతో సమస్యలు తగ్గుతాయనుకొన్నాను. కానీ చట్టాలు వచ్చినప్పటి నుంచే సమస్యలు మరింతగా పెరిగాయి. ఇందుకు కారణం ఏమిటనేది మనమంతా ఆలోచించాలి.
మాణిక్య వర ప్రసాద్, విద్యా శాఖ మంత్రి
కొట్టక పోతే పిల్లలకు చదువు రాదని తల్లిదండ్రులు కూడ భావిస్తున్నారు. దండిస్తే పిల్లల మేధస్సు పెరగదు. దండనతో విద్యార్థులలో హింసా ప్రవృత్తి పెరుగుతుంది.
ప్రొఫెసర్ హర గోపాల్, జనరల్ సెక్రటరీ, సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ
క్రమ శిక్షణ, శిక్షల మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి.
బాల సుబ్రహ్మణ్యం, డైరెక్టర్, విద్యా శాఖ
లెర్నింగ్ డిజెబిలిటీ ఉన్న పిల్లలకు విద్య నేర్పే ఉపాధ్యాయులు మనకు లేరు. అలాగే పుట్టుకతోనే బహు ముఖ ప్రజ్ఞను కలిగి ఉన్న పిల్లలకు చదువు చెప్పగలిగే ఉపాధ్యాయులూ మనకు లేరు. ఈ రెండు రకాల పిల్లలను హాండిల్ చేయగలగటాన్ని ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. విద్యార్థులందరికీ ఒకేలా మూస పద్థతిలో బోధించే విధానాన్నే మనం అనుసరిస్తున్నాం.ఇప్పటి విద్య పడగల క్రింద నడుస్తోంది. అది టీచర్లనీ, విద్యార్థులనీ కాటు వేస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారు. తల్లిని తండ్రి కొడుతున్నాడు. కొట్టటం అనేది కుటుంబంలో ఉంది, సమాజంలో ఉంది. అదే బడిలోకి వచ్చింది. దండన లేని సమాజం ఉన్నప్పుడు దండన లేని బడి ఉంటుంది. శిక్షణా? - శిక్షా అనేది హింస లేని సమాజాన్ని ఆవిష్కరించుకొన్నపుడు సాధ్యమవుతుంది.
డాక్టర్ వీరేందర్, క్లినికల్ సైకాలజిస్ట్
బడిలో బడి వాతావరణం లేదు. వసతులూ లేవు. బడిని ఒక పూల తోటలా నిర్వహించాలి.
రాఘవాచారి, మోడల్ టీచర్
ఉపాధ్యాయులనే బాధ్యులను చేయటం సరికాదు
వెంకట రెడ్డి, అధ్యక్షుడు, పిఆర్టియు
ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:30 ఉంటే సర్వ శిక్షా అభియాన్లో చెప్పినట్లు ఆటపాటలతో బోధించటం సాధ్యమవుతుంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులే మొత్తం పాఠశాలను కంట్రోల్ చేయటం కష్టం. దండన వెనుక ఉన్న కారణాలను కనుగొనాలి. ప్రభుత్వమే పరిష్కార మార్గం వెతకాలి.
వెంకటేశ్వర రావు, కార్యదర్శి, ఎపి యుటిఎఫ్
కక్ష తోనో, కసి తోనో ఉపాధ్యాయులు విద్యార్థులను దండించాలని అనుకోరు. ప్రభుత్వ పరంగా సదుపాయాలు, సిబ్బందిని కల్పించక పోవటం ఒక కారణం. రాష్ట్రంలో 1100 మండలాలు ఉంటే 800 మండలాలలో ఎంఇఓలు లేరు.
కె.నర్సింహా రెడ్డి, అధ్యక్షుడు, ఎస్టియు
ఆరేడు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల వద్ద పనిష్మెంట్ రిజిస్టర్ కూడా ఉండేది. విద్యార్థులను ఎలా దండించాలి? ఎక్కడ కొట్టాలి? ఎలా కొట్టాలి వంటి వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేసేవారు. అంటే దండించటం అనే దానికి చట్టబద్ధత అప్పట్లో ఉన్నట్లే కదా?ఈ పరిస్థితులకు సినిమా, మీడియా, మనం కారణం. మనం ప్రాసెస్ను ఎంజాయ్ చేయకుండా కేవలం రిజల్ట్ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం. సమస్యలకు ఇది ఒక కారణం.
సుబ్బారెడ్డి, అధ్యక్షుడు, ఎపిటిఎఫ్ (1938)
వసతులు లేకపోవటం వల్లనే పిల్లలను కొడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అనటం ఒకరకంగా సోషల్ బ్లాక్ మెయిలింగ్తో సమానం.
ప్రస్తుతం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే రోల్ మోడల్గా నిలవాలి.
సునీల్ కుమార్, నంది అవార్డు గ్రహీత, సొంత ఊరు చిత్ర దర్శకుడు
0 comments:
Post a Comment