రైలు ప్రమాద నిరోధక పరికరం సిద్ధం
పట్టాలపై ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా నిరోధించే పరికరం సిద్ధమైందని రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. త్వరలో దానిని అందుబాటులోకి తేనున్నామని మమతా బెనర్జీ తెలిపారు. దీంతోపాటు అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థనూ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఇవి రెండూ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అక్టోబర్ 7 వ తేదీన ఆమె ఒక సమావేశంలో వెల్లడించారు.
0 comments:
Post a Comment