Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

ప్రతి పంచాయతీలో 17 వేల మొక్కలు

మూడేళ్లలో 31 కోట్ల మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో, రూ.500 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని పచ్చగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. మూడేళ్లలో ప్రతి గ్రామ పంచాయితీలో 17 వేల మొక్కలను నాటే కార్యక్రమం కార్యరూపం దాల్చబోతోంది. మొత్తంమీద 31 కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు చేపట్టబోతున్నాయి. రాష్ట్రంలోని 65 లక్షల హెక్టార్ల అడవుల్లో దాదాపు 30 లక్షల హెక్టార్లలో అడువులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చని వనాలను పెంపొందించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖకు రూ.500 కోట్లను కేటాయించారు.  మహాత్మాగాంధీ గ్రామీణ నర్సరీ  పేరిట ప్రతి మండలంలో నాలుగు నర్సరీల చొప్పున మొత్తం 4,604 నర్సరీలను ఏర్పాటుచేస్తారు.  ప్రతి నర్సరీలో 70 వేల నుంచి 80 వేల మొక్కల్ని పెంచుతారు. టేకు, నీలగిరి, వెదురు, నేరేడు, తుమ్మ, ఎర్రచందనం, ఉసిరి, కానుగ, వేప, సుబాబుల్‌ మొక్కలను పెంచుతారు. ప్రతి నర్సరీకి ఒక వనసేవక్‌, 20 నర్సరీలకు ఒక పోగ్రాం అసిస్టెంటెంట్‌లను నియమించనున్నారు. నిర్ణయించిన కొలతలతో గొయ్యి తీసి బంజరు భూముల్లో గానీ, రోడ్డు పక్కన గానీ మొక్కలు ఎవరు నాటినా ఉపాధి హామీ పథకం కింద నిధులను వీరికి అందజేయనున్నారు. చెరువుల పూడికతీతతో పాటు ఇతరత్రా ఉపాధి పనుల్లాగే దీన్ని కూడా ఉపాధి పథకంలోకి తీసుకువచ్చి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొక్కలు నాటాక వీటి సంరక్షణ బాధ్యతను డివిజనల్‌ ఫారెస్టు అధికారులతో పాటు జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ అధికారులు చేపడతారు.

0 comments:

Post a Comment