బాదం గింజలు బలవర్థకమైన ఆహారమే కాదు.. తరచూ వచ్చే జలుబు, జ్వరాలకు దివ్యౌషధంగా పనిచేస్తాయని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుందని తెలిపింది. బాదం పైపొర రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఇటలీలోని పాలీక్లినికో వర్సిటీ శాస్త్రవేత్త గైసెప్పినా చెప్పారు. తెల్లరక్తకణాల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శరీరంలో వైరస్ల వ్యాప్తిని అరికట్టడంలోనూ బాదం పాత్ర కీలకమని వివరించారు. గింజలు పూర్తిగా అరిగిపోయిన తర్వాత కూడా వాటి ప్రభావం ఉంటుందన్నారు. ''బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, జ్వరంపై ఇవి అద్భుతంగా పనిచేస్తాయి'' అని తెలిపారు.
0 comments:
Post a Comment