రాజీవ్ విద్యా మిషన్కు విద్యా హక్కు బాధ్యత
9/26/2010
Categorized:
హక్కు
విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్కు అప్పగించింది. ఇందుకోసం రాజీవ్ విద్యా మిషన్ కార్యకలాపాల గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ప్రాథమిక విద్య బలోపేతానికి 2001-02లో ప్రారంభమైన రాజీవ్ విద్యా మిషన్ గడువు నిజానికి 2010తో ముగియాలి. విద్యా హక్కు చట్టం అమలు కోసం ఇప్పుడు రెండేళ్ల పొడిగింపు లభించింది. రాజీవ్ విద్యా మిషన్కు 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ.1100 కోట్లను కేటాయించారు. తాజాగా విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి మరో రూ.660 కోట్లు కేంద్రం నుంచి పొందాలని ప్రాథమిక విద్యాశాఖ ప్రతిపాదనలను రూపొందించింది.
విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే 70లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు.
బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్ టూ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి.
0 comments:
Post a Comment