దీప ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న బాల సాహితీవేత్తలు
సమావేశంలో మాట్లాడుతున్నడాక్టర్ అయాచితం శ్రీధర్
సమావేశంలో ప్రసంగిస్తున్న బాల చెలిమి సంపాదకుడు ఎం.వేదకుమార్
ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో 2 ఏప్రిల్ 2018వ తేదీన నిర్వహించిన బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమంలో డాక్టర్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ చిన్నపిల్లలలో పఠనాసక్తిని పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవాన్ని గ్రంధాలయ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో బాల చెలిమి సంపాదకుడు ఎం.వేదకుమార్, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్, బాల సాహిత్య రచయితలు వి.ఆర్.శర్మ, డాక్టర్ సిరి, గంగదేవు యాదయ్య, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ ఎస్. రఘు, తిరునగరి శ్రీనివాస్, మంచి పుస్తకం ప్రచురణ కర్త కె.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.