త్వరలో సుగంధ కోలా శీతల పానీయం
సుగంధ వేళ్లతో సరికొత్తగా సుగంధ రసం కోలారూపంలో రాబోతోంది. రాష్ట్ర అటవీ ప్రాంతంలో దొరికే సుగంధ వేళ్లను దీనికోసం వినియోగించబోతున్నారు. మన రాష్ట్రంలో కర్నూలు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, ఇంకా అనేక జిల్లాల్లో సుగంధ పాల మొక్కలు పెరుగుతున్నాయి. అనేక ఏళ్లనుంచి గిరిజనులు ఈ మొక్కల వేళ్లను సేకరించి విక్రయిస్తున్నారు. ఈ వేళ్లను ఉడికించి అందులోనుంచి వచ్చే రసంలో పంచదార, కొద్దిగా తేనె కలుపుకుని తాగిన వారికి శరీరంలో చల్లదనం చేకూరుతోంది. దీంతో అనేక జిల్లాల్లో సుగంధ రసంతో కూడిన సోడాలను కూడా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో శీతల పానీయాల సంస్థలు సుగంధ వేళ్లతో ప్రత్యేకంగా పానీయాలు తయారు చేయడానికి ఆసక్తిని చూపుతున్నాయి. వాణిజ్య తరహాలో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చే ప్రముఖ శీతల పానీయాల సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వాటికి ఈ వేళ్లను సరఫరా చేయాలని అటవీశాఖ యోచిస్తోంది. ముందుగా ఈ మొక్కలపై పేటెంట్ రైట్స్ను తీసుకోవాలని నిర్ణయించారు.
0 comments:
Post a Comment