'ప్లాస్టిక్ స్థానంలో బట్ట సంచులను వినియోగించండి. పర్యావరణాన్ని కాపాడండి. 'పచ్చదనం-పరిశుభ్రతను సాధించండి' అనే ఈ నినాదంతో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. 'ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్', 'గ్రీన్ ఆర్కిటెక్ట్స్ అండ్ ప్లానర్స్' సంస్థలతో కలిసి బట్ట సంచుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యపరచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేయనున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో ముందుగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పల్లెల్లో సైతం కొనసాగుతాయి.
0 comments:
Post a Comment