హ్రస్వ దృష్టి కారక జన్యువుని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కనిపించే ఈ రుగ్మతను నయం చేయడానికి కొత్త తరహా చికిత్స విధానాలను రూపొందించడానికి ఈ పరిశోధన అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారి కంట్లో రెటీనాను చేరక ముందే దృశ్యాలు ఏర్పడతాయి. దీనివల్ల దూరంలో ఉన్న వస్తువులు మసకగా కనపడతాయి.
కాగా ఈ విషయానికి సంబంధించి లండన్ లోని కింగ్స్ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆర్ఏఎస్జీఆర్ఎఫ్1 అనే జన్యువును గుర్తించింది. ఇది కన్ను వృద్ధిలోను, దృశ్యరూప సంకేతాలను మెదడుకు చేరవేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తేల్చారు.
0 comments:
Post a Comment