-
కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
విప్పితే: కనురెప్పలు!
ల జవాబులు
మామ కాని మామ, ఎవ్వరది?
విప్పితే: చందమామ!
చుట్టింటికి మొత్తే లేదు
జవాబు: కోడి గుడ్డు
నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు
అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు
అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
జవాబు: పెదవులు
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!
తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి
దేశదేశాలకు ఇద్దరే రాజులు
జవాబు: సూర్యుడు, చంద్రుడు
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
జవాబు: తేనెపట్టు
తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
జవా:ఉత్తరం
ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
జవాబు: టెంకాయ
అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
జవాబు: తేనె పట్టు
తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
జవాబు: పుస్తకంలో అక్షరాలు
వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
జవాబు: పొలం గట్టు
ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు
పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్
మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.
జవాబు:తుపాకి/తూట
మూడు కళ్ళ ముసలిదాన్ని
నేనెవరిని?
జవాబు:తాటి ముంజ
బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.
జవాబు:దానిమ్మ పండు.
పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
జవాబు:తన నీడ
మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య.
జవాబు:చెప్పులు
పలుకుగాని పలుకు :
ఎమిటది?
జవాబు:వక్క పలుకు
నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది?
జవాబు:పాపిడి.
పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు
జవాబు:పనస పండు
పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
జవాబు:మొగలి పువ్వు
నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు:దీపం వత్తి
అక్కడిక్కడి బండి అంతరాల బండి:
మద్దూరి సంతలోన మాయమైన బండి.
ఏమిటది?
జవాబు:సూర్యుడు.
అడవిని పుట్టాను,
నల్లగ మారాను:
ఇంటికి వచ్చాను,
ఎర్రగ మారాను:
కుప్పలో పడ్డాను,
తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది:
చెంబులో నీళ్ళని,
చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ?
జవాబు:గడప
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది,
తైతక్కలాడింది.
ఎవరు?
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు.
అన్నదమ్ములం ముగ్గురం మేము,
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:
అయితే బుద్ధులు వేరు --
నీళ్ళలో
మునిగే వాడొకడు:
తేలే వాడొకడు;
కరిగే వాదొకడు:
అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.
అమ్మ కడుపున పడ్డాను,
అంత సుఖమున్నాను:
నీచే దెబ్బలు తిన్నను,
నులువునా ఎండిపోయాను:
నిప్పుల గుండం తొక్కాను:
గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక
ఆకసమంతా అల్లుకు రాగా:
చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ
ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జవాబు:కల్లు
ఆమడ నడిచి అల్లుడొస్తే,
మంచం కింద ఇద్దరూ,
గోడ మూల ఒకరూ,
దాగుకున్నారు.
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర
ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం
ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.
ఇక్కడి నుంచి చూస్తే యినుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండు;
తింటే తీయగనుండు.
జవాబు: తాటిపండు.
ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం
ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చెప్పులు
ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చీపురు
ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
జవాబు: మిరపచెట్టు.
ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు.
జవాబు: ఇంద్రధనస్సు
తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.
జవాబు: పనసకాయ
గోడమీద బొమ్మ
గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారికి
వడ్డించు బొమ్మ.
జవాబు: తేలు.
చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
జవాబు: టెంకాయ .
ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
జవాబు: సైకిలు డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ? జవాబు: దానిమ్మ కాయ.
పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
జవాబు: దీపం
అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
జవాబు:పెదవులు
నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు
వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
జవాబు : గాలిపటం
మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు
చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబు: నాగలిదున్నే రైతు/-------- ( ఒంకర టింకర -అ, వాని తమ్ముడు -సొ,నల్లగుడ్ళ-- మి, నాలుగు కాళ్ళ--మె,) - భూమి లాంటి గ్రహం మరొకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక తార చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి గ్లీస్ 581జీ అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమి కంటే 3 రెట్లు పెద్దగా ఉంది. ఈ గ్రహంపై రాత్రి, పగలు ఉండవు. ఈ గ్రహం పై భూమి తరహాలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవం మనగడకు అనువైన పరిస్థితులూ ఉన్నాయని నీరూ ఉండొచ్చని చెప్పారు. హవాయ్లోని డబ్ల్యూఎం కెక్ అబ్జర్వేటరీలో 11 ఏళ్ల పాటు పరిశీలనలు జరిపి ఈ గ్రహం తీరుతెన్నులను గమనించారు.
-
గణితశాస్త్రంలో వృత్తం చుట్టుకొలత, వ్యాసం నిష్పత్తినే 'పై' అంటారు. దీనిని 22/7గా పేర్కొంటారు. 'పై'ని ఎంత భాగించినా శేషం వస్తూనే ఉంటుందని మనకు తెలుసు. జపాన్కు చెందిన ఒక ఇంజినీర్ సొంతంగా రూపొందించిన కంప్యూటర్ను ఉపయోగించి 'పై' విలువను ఐదులక్షల కోట్ల (ఐదు ట్రిలియన్లు) వరకూ లెక్కించారు. ఒక ఫ్రెంచి ఇంజినీర్ గత ఏడాది నమోదు చేసిన రికార్డును (2.7 ట్రిలియన్లు) బద్దలు కొట్టారు. ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో ఇంజినీర్గా పని చేస్తున్న షిగెరు కొండొ 'పై' విలువను వీలైనన్ని ఎక్కువ స్థానాల వరకూ లెక్కించటానికి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం 32 టెరాబైట్ల హార్డ్డ్రైవ్తో సొంతంగా కంప్యూటర్ను తయారుచేశారు. అనంతరం 5ట్రిలియన్ల స్థానాలవరకూ పై విలువను లెక్కించారు. -
నేనూ పెద్దవాడినయితే
పక్క ఇంటి పిల్లవాడు
'బాబ్జీ' అంతవుతా!
వాడివెంట నేను కూడ బడికిపోయి చదువుతా !
పలకమీద అకరాలు పట్టి పట్టి దిద్దుతా !
అచ్చు లాగా రాసుకొచ్చి అమ్మకు చూపిస్తా !
'అల,వల, తల, కల' అన్ని పేర్లు చదువుతా!
అడగగానే మేష్టారికి అప్పచెప్పి తీరుతా !
ఎంత పెద్ద పద్యమైన అంతలోనె వల్లిస్తా !
తడబడకుండా వడిగా తరగతిలో పాడుతా !
గుక్క తిప్పకుండ నేను ఎక్కాలను చదువుతా !
ఒక్క తప్పు లేకుండా లెక్కలన్ని చేస్తా !
నేను పెద్ద పరీక్షలకు నిద్రమాని చదువుతా !
పట్టు పట్టి తరగతిలో
ఫస్టున ప్యాసవుతా ! -
782474317884...ఈ పన్నెండంకెల సంఖ్య - కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆధార్' ప్రాజెక్టులో భాగంగా జారీ చేసిన మొట్టమొదటి విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్య. మహారాష్ట్రకు చెందిన రజనా సోనావానే అనే గిరిజన మహిళకు ఈ సంఖ్యను కేటాయించారు. దీంతో రజనా దేశంలోనే మొదటి విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందిన మహిళగా నిలిచారు. ఈ సంఖ్యే ఆమెకు జీవితాంతం అధికారిక గుర్తింపుగా ఉండిపోతుంది. ఇదే విధంగా భారత దేశం లోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్యను కేటాయించనున్నారు.ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీలు 29 సెప్టెంబర్ న నందర్బార్ జిల్లాలోని తెంబ్లీ గిరిజన గూడెంలో 'ఆధార్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్డుల రూపశిల్పి 'యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' చీఫ్ నందన్ నిలేకని కూడా పాల్గొన్నారు. ''చాలామంది పేదలకు ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవు. దీంతో వారు బ్యాంకులో ఖాతా తెరవడానికైనా, రేషన్ పొందడానికైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధినీ పొందలేకపోతున్నారు. అవన్నీ దారిమళ్లి దళారులు, ఇతరుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ కార్డులతో ఆ సమస్యలు తొలగుతాయి'' అని ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. -
-
పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.
మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.
ఇక్కడ కొన్ని పొడుపు కథలు ఇస్తున్నాం. వీటిని విప్పే ప్రయత్నం చేయండి.
1 కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
2 మామ కాని మామ, ఎవ్వరది?
3 చుట్టింటికి మొత్తే లేదు
4 నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
5 అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
6 అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
7 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
8 తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
9 దేశదేశాలకు ఇద్దరే రాజులు
10 చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
11 తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
12 ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
13 అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
14 తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
15 వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
16 ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
17 పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
18 మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత.
19 మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
20 బంగారు భరిణలో రత్నాలు: పగుల గొడితేగాని రావు.
21 పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
22 మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య.
23 పలుకుగాని పలుకు :ఎమిటది?
24 నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది?
25 పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు
26 పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది: తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
27 నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
28 అక్కడిక్కడి బండి అంతరాల బండి: మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది?
29 అడవిని పుట్టాను, నల్లగ మారాను: ఇంటికి వచ్చాను, ఎర్రగ మారాను: కుప్పలో పడ్డాను, తెల్లగ మారాను.
30 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుంది.
31 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి. ఎవరు ?
32 అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు -- నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాదొకడు: అయితే మే మెవరం?
33 అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
34 ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
35 ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
36 ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ,దాగుకున్నారు.
37 ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
38 ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
39 ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు.
40 ఊరంతకీ ఒక్కటే దుప్పటి
41 ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
42 ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
43 ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి.
44 ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
45 ఏడుగురు అన్నదమ్ములం మేము;విడివిడిగా వుంటే చెప్పలేవు ,కలసి వుంటే చెప్పగలవు.
46 తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు.
47 గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ.
48 చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
49 ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
50 పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
51 అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
52 నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
53 వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచుఅంబరమున దిరుగు నది యేమిచోద్యమో
54 మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారుచెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబుల కోసం ఇక్కడ చూడండి. -
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా హోంవర్క్ను, యూనిట్ టెస్ట్లను కుదించుకోవాలని నిర్ణయించిన సీబీఎస్ఈ బోర్డు మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన కంటిన్యువస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్(సీఎస్ఈ) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విషయంలో ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా విభిన్న వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శిక్షకులను, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను తయారు చేయాలని నిర్ణయించింది. తమ ప్రాజెక్టు వర్క్ల్లో మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా, ఇచ్చిన పనుల్లో మరింతగా లీనమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కృషి చేస్తారు. అలాగే, తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు నెరపుతూ పిల్లలపై వారిలో ఉన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. -
విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే 70లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు.
బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్ టూ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి. -
ఇంటర్నెట్ వీక్షణలో పీసీలను వెనక్కు నెట్టి సెల్ఫోన్లు ముందంజ లోకి చేరుకున్నాయి. నిన్న గాక మొన్న వచ్చిన సెల్ఫోన్లు ఇంటర్నెట్ వీక్షణలో పీసీలను వెనక్కు నెట్టేస్తున్నాయి. కేవలం ఫోన్ సంభాషణ జరపడం, ఎస్సెమ్మెస్లు పంపడం అన్న పరిధి నుంచి సెల్ఫోన్ లు విస్తరించి పీసీల పనిని కూడా చేస్తున్నాయి.
తాజాగా జరిపిన ఓ సర్వే ప్రకారం ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నెటిజన్లు పీసీల కంటే కూడా సెల్ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారని వెల్లడైంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం, వార్తలు చదువుకోవడం, క్రీడా వార్తలు తెలుసుకోవడం, సోషల్నెట్వర్కింగ్ సైట్లను వీక్షించడం వంటి రోజువారీ అవసరాలకు పీసీల కంటే కూడా సెల్ఫోన్ల మీదే ఎక్కువ మంది నెటిజన్లు ఆధారపడుతున్నారని సర్వేలో తెలిసింది. రెండేళ్ల క్రితం మార్కెట్లోకి ఐఫోన్ వచ్చినప్పటి నుంచీ ఈ పరిస్థితి పెరిగిందన్నారు. ఇంటర్నెట్ను వీక్షించే మూడు పదుల వయసు వారిలో సగానికి పైగా సెల్ఫోన్ పైనే ఆధారపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. వారి వద్ద పీసీలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా నెట్ బ్రౌజింగ్ కోసం సెల్ఫోన్ల మీదే వీరు ఆధారపడుతున్నట్లు సర్వేలో తెలిసింది. -
భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ధ్రువీకరణ బాటిళ్లలో విక్రయించే మంచినీటికి తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ఆహార శాఖ స్పష్టం చేసింది. మినరల్ వాటర్తో సహా బాటిళ్లలో విక్రయించే అన్ని రకాల మంచినీళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ''మంచినీటి తయారీ, విక్రయం, ప్రదర్శన - వీటిలో ఏది చేయాలన్నా ఆ నీటికి బీఐఎస్ ప్రమాణాల ధ్రువీకరణ తప్పనిసరి'' అని ఆహారశాఖ పేర్కొన్నది. సాధారణ తాగునీటికి ఐఎస్ 14543:2004 ప్రమాణాలను, మినరల్ వాటర్కు 13428:2005 ప్రమాణాలను పాటించాలని తెలిపింది. మినరల్ వాటర్కు సంబంధించి 18 కంపెనీలకు, రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మంచినీటిని విక్రయిస్తున్న సంస్థలకు 2,354 లైసెన్సులు ఉన్నాయని, సహజసిద్ధంగా లభిస్తున్న మంచినీటిని విక్రయించేందుకు 633 లైసెన్సులు ఉన్నాయని పేర్కొంది. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.