-
పరీక్షల్లో రాకపోతేమీకు మంచి మార్కులు,కలెక్టర్లు కాదు, మీరుకాగలరట క్లర్కులు!
ఆటపాటలసలేమీవద్దని కా దర్థం,ఎంతో విలువైన టైము,చేయరాదు వ్యర్థం!
వారానికి ఒక్కసారిచాలు మీకు వీడియో,అప్పుడపుడు వినవచ్చునువీలయితే రేడియో!
వ్యసనంగా మారరాదుఇంటివద్ద టీ.వీ.సండే ఉదయాన తప్పపనికొచ్చే వేవీ?
కళ్ళు ఉరిమి చూసిందనినిన్ను క్లాసు టీచరు,అమ్మకి మొరపెట్టరాదు,తనొక పూరు క్రీచరు!
వచ్చే సంచిక వరకూచాలును ఈ పాఠంనాకూ వేరే వున్నదికద ఒక జంఝాటం!
- దేవీప్రియ అంకుల్ -
-
సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
* 1 పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
* 2 పగటి ముచ్చట పని చేటు
* 3 పండిత పుత్ర పరమ శుంఠ
* 4 పండితపుత్రుడు... కానీ పండితుడే...
* 5 పందికేంతెలుసు పన్నీరు వాసన
* 6 పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
* 7 పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
* 8 పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
* 9 పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
* 10 పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
* 11 పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
* 12 పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
* 13 పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
* 14 పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
* 15 పావలా కోడికి ముప్పావలా దిష్టి
* 16 పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
* 17 పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
* 18 పాలు, నీళ్ళలా కలిసిపోయారు
* 19 పిండి కొద్దీ రొట్టె
* 20 పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
* 21 పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
* 22 పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
* 23 పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
* 24 పిచ్చోడి చేతిలో రాయి
* 25 పిచ్చోడికి పింగే లోకం
* 26 పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
* 27 పిల్లికి బిచ్చం పెట్టనివాడు
* 28 పుండుకు పుల్ల మొగుడు
* 29 పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
* 30 పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
* 31 పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
* 32 పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
* 33 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
* 34 పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
* 35 పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
* 36 పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
* 37 పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
* 38 పెరుగుట విరుగుట కొరకే
* 39 పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
* 40 పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
* 41 పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
* 42 పైన పటారం, లోన లొటారం
* 43 పొట్టోడికి పుట్టెడు బుద్దులు
* 44 పొమ్మనలేక పొగపెట్టినట్లు
* 45 పొయ్యి దగ్గర పోలీసు
* 46 పొరుగింటి పుల్లకూర రుచి
* 47 పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు -
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనున్న 7, 9 తరగతుల పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు, విపత్తు నిర్వహణ తదితర అంశాలు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఈ విషయానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన పెంపొందాల్సిన అవసరాన్ని తెలియజేయడంతో పాటు చట్టం ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రం లోని పలు ప్రాంతాలు తరచూ కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తుపాన్లు, సునామీ, వరదలు వంటి విపత్తులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విపత్తులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో 'విపత్తు నిర్వహణ' అంశాన్ని చేర్చేందుకు సిద్ధమైంది. పౌరులకు రాజ్యాంగ హక్కులు- బాధ్యతలు, బుద్ధిమాంద్యం, పర్యావరణం తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం దశలవారీగా 1 నుంచి 6 తరగతుల వరకు కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపొందించింది. ప్రస్తుతం 7 నుంచి 10 వ తరగతి వరకు పుస్తకాలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2011-12లో 7, 9; 2012-13లో 8, 10 తరగతుల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందవచ్చు. - పసుపులో అనేక వైద్య గుణాలు ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. కేన్సర్ చికిత్సలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని ఇపుడు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అయింది. ఈ పరిశోధన బృందానికి భారత సంతతికి చెందిన ఎరి శ్రీవత్సన్ నాయకత్వం వహించటం విశేషం. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థాన్ని సిస్ల్పాటిన్ అనే ఔషధంతో కలిపితే, కేన్సర్ చికిత్సకు ఇచ్చే కీమోథెరపీ సామర్థ్యం పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, మెడ కేన్సర్ చికిత్సలో ఇది సాయపడుతుందని వారు తెలిపారు. పసుపు వాపు, మంటలను తగ్గిస్తుందని రుజువైంది. కొన్ని రకాల కేన్సర్లను అణచివేస్తుందని గతం లో జరిగిన అధ్యయనాల్లోనూ తేలింది. మెదడు, మెడ కేన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఆలస్యంగా గుర్తిస్తే శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ వంటివి ఇవ్వాలి. శ్రీవత్సన్, వాంగ్లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో కర్కుమిన్ ద్వారా మెదడు, మెడ కేన్సర్లు నయమవుతాయని తేలింది. దీనివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు తగ్గుతాయని వివరించారు.