సదానందకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
 |
సదానంద |
ప్రముఖ కథా రచయిత, విశ్రాంత అధ్యాపకుడు కలువకొలను సదానందకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సదానంద రచించిన 'అడవి తల్లి' నవల కేంద్ర సాహిత్య అకాడమీ అందించే అరుదైన బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర అకాడమీ 2010 సంవత్సరానికి ఉత్తమ బాల సాహిత్యంగా ఆగస్టు 20న గోవాలో జరిగిన సాహితీ బోర్డు సమావేశంలో ఈ పుస్తకాన్ని ఎంపిక చేశారు. పన్నెండేళ్ల కిందట ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసిన సదానంద పలు పత్రికలకు వ్యాసాలు రాశారు. ఈయన గతంలో అనేక పురస్కారాలు పొందారు. ఆయన రాసిన నవల 'బంగారు నడచిన బాట'కు 1966లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అత్యుత్తమ బాల సాహిత్య పురస్కారం దక్కింది. 1976లో కథానికా రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
0 comments:
Post a Comment