భారతీయ రూపాయికి ఇన్నాళ్లకు గుర్తు లభించనుంది. దేవనాగరి లిపినుంచి 'ర' రోమన్ గుర్తు 'ఆర్' ను కలిపి ఈ గుర్తును రూపొందించారు. బోంబే ఐఐటీ విద్యార్థి ఉదయ్కుమార్ దీన్ని రూపొందించారు. ఈ గుర్తుకోసం దేశవ్యాప్తంగా 3వేల డిజైన్లు తుది పోటీకి రాగా ఉదయ్కుమార్ డిజైన్ను ఎంపికచేశారు. కేంద్ర మంత్రివర్గం 15 జూలై న ఈ గుర్తును ఆమోదించింది. దీంతో ఇక యు.ఎస్.డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ 'యెన్' తరహాలో మన రూపాయకూ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. అయితే దీన్ని కరెన్సీ నోట్పై మాత్రం ముద్రించరు. త్వరలో అమల్లోకి రానున్న యునిక్కోడ్, ప్రపంచస్థాయి వ్యాపారలావాదేవీలు, వ్యాపార, ప్రింట్ మీడియాలో డిస్ప్లేల సందర్భంగా ఈ గుర్తును వాడతారు. మరో 6 నెలల్లో మన దేశంలోను రెండేళ్లలోను ప్రపంచవ్యాప్తంగాను ఈ గుర్తు అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి అంబికాసోనీ తెలిపారు.
ప్రత్యేక గుర్తుతో ఇదీ లాభం...
దీంతో యూరప్లోని పెద్దపెద్ద కంపెనీలన్నీ తమ కంప్యూటర్ సిస్టమ్స్లో సింబల్కి చోటు కల్పించేందుకు 50 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు రూపాయి గుర్తుకి కూడా ఇదే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్లో తీసుకుంటే సాఫ్ట్వేర్లో కొత్త గుర్తును కూడా చేర్చాలి. పైపెచ్చు కీ బోర్డులో ఈ గుర్తుతో కూడిన కీని చేర్చాలి. అలాగే టైప్ రైటర్స్లోను, మొబైల్ పోన్లలోను కూడా దీనికి చోటు కల్పించాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్లే యూనికోడ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లు రూపాయి గుర్తును ఎన్కోడ్ చేశాక ఐటీ సంస్థలు తమ ఆపరేటివ్ సాఫ్ట్వేర్లో అప్డేట్లాగా కానీ, కొత్త ప్రోగ్రాం ద్వారా గానీ దానికి చోటు కల్పించేలా నాస్కామ్ చొరవ తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.
కరెన్సీపై మాత్రం గుర్తు ఉండదు..
ప్రస్తుతం డాలరు, యూరో, యెన్ మొదలైన కరెన్సీలకు ప్రత్యేక గుర్తులు ఉన్నా వాటిని ఆయా నోట్లపై మాత్రం ముద్రించడం లేదు. నోట్లపై అక్షరాల్లో రాస్తున్నారంతే. ఒక్క పౌండ్ స్టెర్లింగ్ గుర్తును మాత్రమే నోట్లపై ముద్రిస్తున్నారు. మిగతా వాటి తరహాలోనే కరెన్సీ నోట్లపై గానీ నాణేలపై కానీ రూపాయి గుర్తు ముద్రణ ఉండదని, ఇప్పట్లానే అక్షరాల్లో రాయటాన్నే కొనసాగిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
రూపాయిని ఇప్పటిదాకా దేశంలో వివిధ భాషల్లో వివిధ రకాలుగా పలుకుతున్నారు. రాసేటపుడు కూడా వివిధ రకాలుగా రాస్తున్నారు. హిందీలో రూప్యా, గుజరాతీలో రూపియో, తమిళంలో రుబాయి.. త్రిపురా, మిజోరాం, ఒరిస్సా, అసోం రాష్ట్రాల్లో టంకా, బెంగాలీలో టాకా అని పిలుస్తున్నారు. రాసేటప్పుడు కూడా ఇంగ్లీషులోని ఆర్ఎస్, ఆర్ఈ, టి వంటి అక్షరాలతోను, తెలుగులో రూ.. అని రాస్తున్నారు. ఇకపై వాడుక భాషలో రూపాయి, రుబాయి, రూప్యా అంటూ మాట్లాడినా, రాసేటపుడు మాత్రం అందరూ ఒకే గుర్తును రాసే అవకాశముంది. కాకుంటే దీనికి కొంత సమయం పట్టొచ్చు.
రూపాయి గుర్తుకు రూపమిచ్చిన డి.ఉదయ్కుమార్ పుట్టింది తమిళనాడులో. ప్రస్తుతం ఐఐటీ-ముంబైలో పీహెచ్డీ చేస్తున్నారు. డిజైన్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న ఉదయ్కుమార్ చిప్ అనే కంప్యూటర్స్ మ్యాగజైన్లో డిజైన్ హెడ్గా కూడా పనిచేశారు. తాజాగా ఆయన ఐఐటీ-గౌహతిలోని డిజైన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరబోతున్నారు కూడా. రూపాయి గుర్తు ఎంపిక ప్రకటన వెలువడగానే ఉదయకుమార్కు మీడియా నుంచి కాల్స్ వెల్లువెత్తాయి. "నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను రూపొందించిన గుర్తులో త్రివర్ణ పతాకం కూడా ప్రతిబింబించాలని అనుకున్నాను. భారతీయ లిపిలో అక్షరాలకు పైన గీత అనేది దేవనాగరిలోనే ఉంటుంది. అందుకే ఆ లిపిలోని ర అక్షరం, రోమన్ అక్షరం ఆర్లు, పైన రెండు గీతలు మధ్యలో తెల్లని వ ర్ణం కలబోతతో రూపాయి గుర్తు రూపొందించాను' అని ఉదయ్కుమార్ చెప్పారు. ఈ గుర్తును రూపొందింఛి నందుకు గాను ఉదయ్కుమార్కి రెండున్నర లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
ప్రత్యేక గుర్తుతో ఇదీ లాభం...
- గుర్తు రావటం వల్ల రూపాయికి బ్రాండ్ ఏర్పడి అంతర్జాతీయంగా దీని గుర్తింపు సులువవుతుంది.
- మున్ముందు డాలర్, పౌండు, యూరో, యెన్ల తరహాలోనే మన కరెన్సీలోనూ ట్రేడింగ్ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.
- అంతర్జాతీయ ప్రాచుర్యంతో భారత్లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారముంటుంది.
దీంతో యూరప్లోని పెద్దపెద్ద కంపెనీలన్నీ తమ కంప్యూటర్ సిస్టమ్స్లో సింబల్కి చోటు కల్పించేందుకు 50 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు రూపాయి గుర్తుకి కూడా ఇదే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్లో తీసుకుంటే సాఫ్ట్వేర్లో కొత్త గుర్తును కూడా చేర్చాలి. పైపెచ్చు కీ బోర్డులో ఈ గుర్తుతో కూడిన కీని చేర్చాలి. అలాగే టైప్ రైటర్స్లోను, మొబైల్ పోన్లలోను కూడా దీనికి చోటు కల్పించాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్లే యూనికోడ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లు రూపాయి గుర్తును ఎన్కోడ్ చేశాక ఐటీ సంస్థలు తమ ఆపరేటివ్ సాఫ్ట్వేర్లో అప్డేట్లాగా కానీ, కొత్త ప్రోగ్రాం ద్వారా గానీ దానికి చోటు కల్పించేలా నాస్కామ్ చొరవ తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.
కరెన్సీపై మాత్రం గుర్తు ఉండదు..
ప్రస్తుతం డాలరు, యూరో, యెన్ మొదలైన కరెన్సీలకు ప్రత్యేక గుర్తులు ఉన్నా వాటిని ఆయా నోట్లపై మాత్రం ముద్రించడం లేదు. నోట్లపై అక్షరాల్లో రాస్తున్నారంతే. ఒక్క పౌండ్ స్టెర్లింగ్ గుర్తును మాత్రమే నోట్లపై ముద్రిస్తున్నారు. మిగతా వాటి తరహాలోనే కరెన్సీ నోట్లపై గానీ నాణేలపై కానీ రూపాయి గుర్తు ముద్రణ ఉండదని, ఇప్పట్లానే అక్షరాల్లో రాయటాన్నే కొనసాగిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
రూపాయిని ఇప్పటిదాకా దేశంలో వివిధ భాషల్లో వివిధ రకాలుగా పలుకుతున్నారు. రాసేటపుడు కూడా వివిధ రకాలుగా రాస్తున్నారు. హిందీలో రూప్యా, గుజరాతీలో రూపియో, తమిళంలో రుబాయి.. త్రిపురా, మిజోరాం, ఒరిస్సా, అసోం రాష్ట్రాల్లో టంకా, బెంగాలీలో టాకా అని పిలుస్తున్నారు. రాసేటప్పుడు కూడా ఇంగ్లీషులోని ఆర్ఎస్, ఆర్ఈ, టి వంటి అక్షరాలతోను, తెలుగులో రూ.. అని రాస్తున్నారు. ఇకపై వాడుక భాషలో రూపాయి, రుబాయి, రూప్యా అంటూ మాట్లాడినా, రాసేటపుడు మాత్రం అందరూ ఒకే గుర్తును రాసే అవకాశముంది. కాకుంటే దీనికి కొంత సమయం పట్టొచ్చు.
రూపాయి గుర్తుకు రూపమిచ్చిన డి.ఉదయ్కుమార్ పుట్టింది తమిళనాడులో. ప్రస్తుతం ఐఐటీ-ముంబైలో పీహెచ్డీ చేస్తున్నారు. డిజైన్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న ఉదయ్కుమార్ చిప్ అనే కంప్యూటర్స్ మ్యాగజైన్లో డిజైన్ హెడ్గా కూడా పనిచేశారు. తాజాగా ఆయన ఐఐటీ-గౌహతిలోని డిజైన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరబోతున్నారు కూడా. రూపాయి గుర్తు ఎంపిక ప్రకటన వెలువడగానే ఉదయకుమార్కు మీడియా నుంచి కాల్స్ వెల్లువెత్తాయి. "నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను రూపొందించిన గుర్తులో త్రివర్ణ పతాకం కూడా ప్రతిబింబించాలని అనుకున్నాను. భారతీయ లిపిలో అక్షరాలకు పైన గీత అనేది దేవనాగరిలోనే ఉంటుంది. అందుకే ఆ లిపిలోని ర అక్షరం, రోమన్ అక్షరం ఆర్లు, పైన రెండు గీతలు మధ్యలో తెల్లని వ ర్ణం కలబోతతో రూపాయి గుర్తు రూపొందించాను' అని ఉదయ్కుమార్ చెప్పారు. ఈ గుర్తును రూపొందింఛి నందుకు గాను ఉదయ్కుమార్కి రెండున్నర లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
0 comments:
Post a Comment