ఉండవల్లి గుహలు కొండలను తొలిచి నిర్మించిన గుహాలయాలకు ఒక ఉదాహరణ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదికి దక్షిణంగా ఈ గుహలు ఉన్నాయి. 4 - 5 శతాబ్థాల కాలంలో ఇక్కడ చిన్న చిన్న గుహలను తొలిచారు. అయితే వీటిలో పెద్ద గుహ నాలుగు అంతస్తులను కలిగి ఉంది. రెండవ అంతస్తులో ఒకే గ్రానైట్ రాతితో చెక్కిన అతి పెద్ద అనంత పద్మనాభుడి విగ్రహం ఉంది. తొలుత ఈ గుహలను బౌద్ధ ఆరామాల రీతిలో నిర్మించినట్లు కనిపిస్తుంది.
ఉండవల్లి గుహలను క్రీ.శ. 420 నుంచి 620 సంవత్సరాల మధ్య పరిపాలించిన విష్ణుకుండిన రాజుల కాలంలో నిర్మించారు.
ఉండవల్లి హైదరాబాద్ నుంచి 280 కిలో మీటర్ల దూరంలో ఉంది. విజయవాడనుంచి 6 కిలో మీటర్ల దూరం లోను, గుంటూరు నుంచి 22 కిలో మీటర్ల దూరంలోను ఉండవల్లి ఉంది. మంగళగిరి, అమరావతి ఇక్కడకు దగ్గరలో ఉన్న దర్శనీయ స్థలాలు.
0 comments:
Post a Comment