ఆది మానవులు నరమాంస భ క్షకులు
8,00,000 సంవత్సరాల క్రితం ఆది మానవుడు నరమాంస భక్షణ చేశాడని, పిల్లలను చంపి తినే స్థాయి నుంచి ఇప్పటి నాగరికుడిగా మారాడని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఆది మానవులు పిల్లలను తినేవారని తాజా తవ్వకాల్లో బయటపడింది. ఇటీవల స్పెయిన్లోని గుహల్లో జం తువుల అవశేషాల్లో పిల్లల ఎముకలు కూడా కనిపించాయి. అవి జంతువులు తిని వదిలేసిన పిల్లల శరీరాల ఎముకల్లాగా లేవని పరిశోధకుల అంచనా. జంతువులు, పిల్లల ఎముకలపై ఆనాటి రాళ్లతో చేసిన ఆయుధాలతో గాయపరచగా ఏర్పడిన గుర్తులున్నాయి. పిల్లల పుర్రెల కింది భాగంలో కూడా మనుషులు లోప లి భాగాన్ని తీసి తిన్నట్లుగా గాయాల గుర్తులున్నాయి. ఆది మానవులు జంతువులతో పాటు పిల్లలను కూడా ఆహారంగా తీ సుకునే వారని పరిశోధకుల విశ్లేషణ.
0 comments:
Post a Comment