బాల సాహిత్యం సృష్టించబడాలని డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 10వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు అద్భుతాలు చెబితే ఆసక్తిగా ఉంటుందని తద్వారా వారు భిన్నమైన కోణంలో కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉంటుందన్నారు. బాలలకు సాహిత్యంతోపాటు కళలు, పెయింటింగ్ మొదలైన వాటిపై ఆసక్తి ఉంటుందని తల్లిదండ్రులు పిల్లలును ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. పిల్లలకు గ్రహణశక్తి ఎంతో ఉంటుందని చెప్పారు. బాల సాహిత్యంపై నేటి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై అన్నారు. ఈ సందర్భంగా ఆయన బాలలపై వచ్చిన పలు పుస్తకాలపై ముచ్చట్ల రూపంలో వివరించారు.
తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య మాట్లాడుతూ ప్రపచం, భారతదేశంలో బాలల సాహిత్యానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. గతంలో ఎన్నో పత్రికలు ఆకాశవాణి వంటి, బాలానంద వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు చేరువ అయినట్లు తెలిప్పారు. విద్యావిధానంలో తెలుగుకు స్థానం తగ్గిపోవడం వల్ల బాలల సాహిత్యంపై పెద్దగా పుస్తకాలు రాకపోవడం బాధాకరం అన్నారు.
ముక్తా ఫౌండర్ మెంబర్ కటికనేని విమల, ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు సి.ఎ.ప్రసాద్ మాట్లాడుతూ సాహిత్య కారులు, ఆర్టిస్టులు బాలల ప్రపంచంలోకి వెళ్లితేనే వారు అందమైన చిత్రాలు గీయగలరని తెలిపారు. సాహిత్యంలోకి వెళ్లితే ఎన్నో అందమైన అద్భుతాలు ఆవిష్కృతమవుతాయన్నారు. అద్భుతాన్ని చూపించేది ఏదైనా బాల సాహిత్యమే అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. పత్తిపాక మోహన్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైౖర్మన్ మణికొండ వేదకుమార్ బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణం అన్నారు.
కార్యక్రమంలో కళాకారుడు, చిత్రకారుడు బాబు దుండ్రపల్లి, ఆర్టిస్ట్ సిరిస్వామి, డాక్టర్ వి.ఆర్.శర్మ, నాళేశ్వరం శంకరం, జుగాష్విలీ, ప్రార్థన, సయ్యద్ షాబీర్, వెంకటమ్మ, బాల్రాజు, ఖైజర్, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ గోళం రెజా రమేజాని దర్శకత్వం హించిన 'హయత్' హిందీ షార్ట్ ఫిల్మ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
0 comments:
Post a Comment