ప్రాచీన మానవుడి ఆధారాలు
'మంచుయుగంలోనూ మనిషి బతికాడు' అనేందుకు ఆధారాలు లభించాయి.మానవుడు తీవ్రస్థాయి ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించాడని తాజా అధ్యయనం వెల్లడించింది. మంచుయుగంలో ఉండే అతి శీతల వాతావరణాన్ని తట్టుకుని మనిషి జీవించాడని గుర్తించారు. ఆఫ్రికా దక్షిణ కోస్తా ప్రాంతంలోని గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో భూమి తేలిన ప్రాంతంలో ప్రాచీన మానవుడి అవశేషాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికా నగరం కేప్టౌన్కు 240 మైళ్ల దూరంలోని సంచారం లేని గుహల్లో ప్రాచీన మానవుడికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. మంచుయుగం కాలంలో అదొక నివాస ప్రాంతం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment