''తమపై తమకు నమ్మకమున్న కొందరు వ్యక్తుల చరిత్రే, ఆ దేశ చరిత్ర అవుతుంది'' అని స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు. ఆ కోవకు చెందిన వ్యక్తి దుర్గాబాయ్ దేశ్ముఖ్.
దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒక ఆదర్శ వనిత. స్వాతంత్య్ర సమర యోధురాలు. ఆమె జీవిత కాలం ఒక ఉత్తేజపూరితమైన వనితగా జీవించారు. ఇప్పటికీ ఆమె జీవితం యువతరాన్ని ఉత్తేజపరుస్తూనే ఉంది. బాల్యంలో ఆమె పేరు దుర్గ. పెద్దయ్యాక దుర్గాబాయమ్మ గాను, వివాహం జరిగిన తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ గాను మారింది. చిన్ననాట దుర్గ బాగా అల్లరి చేసేది. ఆటపాటలందు శ్రద్ధ చూపేది. చేసే ప్రతి పని లోను పట్టుదల చూపేది. పని పూర్తయ్యే వరకు ఆ పని కొనసాగించేది. అదే శ్రద్ధ, అదే పట్టుదల ఆమె జీవితాంతం కొనసాగించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను ఆమె పొందారు. భారత మహిళకు ఆమె ఒక గుర్తింపు కల్పించారు. ఉపాధి అవకాశాలను కల్పించారు. వ్యక్తిత్వం కల్పించారు. అంతటి ప్రతిభాశాలి ఆమె.
'సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్' పుస్తకం ఆమె జీవితాన్ని సంక్షిప్తంగా మన ముందు ఆవిష్కరిస్తుంది. తేలికయిన భాష, మృదువైన రీతిలో వ్రాసిన ఈ పుస్తకం ఆ మహోన్నత వనిత జీవితగాధను మన ముందుంచుతుంది.
మాదిరాజు గోవర్థన రావు సాధారణ ప్రజానీకానికి, ముఖ్యంగా పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించారు. 'సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్' పుస్తకాన్ని ఆయన కేవలం పిల్లల కోసమే రచించారు.
ఈ పుస్తకాన్ని పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. పుస్తకం వెల 70 రూపాయలు.
దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒక ఆదర్శ వనిత. స్వాతంత్య్ర సమర యోధురాలు. ఆమె జీవిత కాలం ఒక ఉత్తేజపూరితమైన వనితగా జీవించారు. ఇప్పటికీ ఆమె జీవితం యువతరాన్ని ఉత్తేజపరుస్తూనే ఉంది. బాల్యంలో ఆమె పేరు దుర్గ. పెద్దయ్యాక దుర్గాబాయమ్మ గాను, వివాహం జరిగిన తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ గాను మారింది. చిన్ననాట దుర్గ బాగా అల్లరి చేసేది. ఆటపాటలందు శ్రద్ధ చూపేది. చేసే ప్రతి పని లోను పట్టుదల చూపేది. పని పూర్తయ్యే వరకు ఆ పని కొనసాగించేది. అదే శ్రద్ధ, అదే పట్టుదల ఆమె జీవితాంతం కొనసాగించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను ఆమె పొందారు. భారత మహిళకు ఆమె ఒక గుర్తింపు కల్పించారు. ఉపాధి అవకాశాలను కల్పించారు. వ్యక్తిత్వం కల్పించారు. అంతటి ప్రతిభాశాలి ఆమె.
'సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్' పుస్తకం ఆమె జీవితాన్ని సంక్షిప్తంగా మన ముందు ఆవిష్కరిస్తుంది. తేలికయిన భాష, మృదువైన రీతిలో వ్రాసిన ఈ పుస్తకం ఆ మహోన్నత వనిత జీవితగాధను మన ముందుంచుతుంది.
మాదిరాజు గోవర్థన రావు సాధారణ ప్రజానీకానికి, ముఖ్యంగా పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించారు. 'సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్' పుస్తకాన్ని ఆయన కేవలం పిల్లల కోసమే రచించారు.
ఈ పుస్తకాన్ని పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. పుస్తకం వెల 70 రూపాయలు.
0 comments:
Post a Comment