వెల్లుల్లితో రక్తపోటు నియంత్రణ
అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి మిశ్రమం దివ్యౌషధమని తేలింది. డాక్టర్ కారిన్ రీడ్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అయితే ముడి లేదా ఉడికించిన వెల్లుల్లి, వెల్లుల్లి పొడి మాత్రం అంత ప్రభావం చూపదని పరిశోధకులు అంటు న్నారు. నిల్వ ఉంచిన వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. వెల్లుల్లి నైట్రిక్ ఆక్సైడ్(ఎన్వో), హైడ్రోజన్ సల్ఫేడ్ లాంటి రసాయనాల విడుదలకు దోహదపడుతుంది. దీనిద్వారా రక్తనాళాలు ఉపశమనం పొందుతాయి. తద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
0 comments:
Post a Comment