అనగా అనగా ఒక అడవి. ఆ అడవికి ఒక సింహం రాజు. నక్క ఆ సింహానికి మంత్రిగా ఉండేది. అది గుంటనక్క. జిత్తులమారి కూడా. అది కపటోపాయంతో మాయమాటలు చెప్పి రోజుకో జంతువును రాజుగారికి ఆహారంగా తీసుకుని వస్తుండేది. ఆ జంతువును చంపి సింహం తినగా మిగిలిన మాంసాన్ని నక్క తింటుండేది. ఇలా తింటుండగా కొన్ని రోజుల తరువాత అడవిలో జంతువులన్నీ అయిపోయాయి. సింహానికి ఆహారం దొరకకపోతే తననే చంపేస్తుందని నక్కకు భయం పట్టుకుంది. చిన్న ఉపాయం ఆలోచించింది.
'మృగరాజా ఈ అడవిలో జంతువులన్నీ అయిపోయి అటు చివర ఒక పులి మాత్రమే ఉంది. అది మీ దగ్గరకి రానంటుంది. మీరే వెళ్ళి దాన్ని చంపి తినండి' అంది.
కూర్చున్న దగ్గరికే ఆహారం వస్తుంటే తిని సోమరిగా తయారైంది సింహం. తనిప్పుడు పులితో పోట్లాడి జయించలేదు. ఈ విషయం తెలిసే నక్క కుట్ర పన్నింది.
సింహానికి నక్క కుట్ర అర్థమైంది.
''పులి సంగతి రేపు చూస్తాను. ఇవ్వాల్టికి నువ్వున్నావుగా'' అని నక్క పైకి దూకి గుటకాయస్వాహా చేసింది.
(పిల్లలూ... ఇది పాతకథ. ఎన్నో సార్లు విని ఉంటారు. అందుకే దీన్ని 'అనగా అనగా ఒక కథ' అందాం. ఇలాంటి కథలు మీరు రాసి పంపించవచ్చు. మీ ఫోటో, పేరుతో ప్రచురిస్తాం.)
0 comments:
Post a Comment