సైకిల్కు పాతికేళ్ల గ్యారంటీ
మనం ఏదైనా సైకిల్ను కొంటే దానికి మహా అయితే ఏడాది గ్యారంటీ ఇస్తారు. కానీ దీనికి భిన్నంగా, 25 ఏళ్లు పాటు సైకిల్కు గ్యారంటీ ఇస్తానంటూ ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ తరహా గ్యారంటీ దేశంలోనే ప్రప్రథమం. అయితే ఇందుకు కొంత అదనంగా చెల్లించాలని చెప్తోంది. ఈ కంపెనీ 'బుల్పవర్' పేరుతో కొత్త సైకిళ్ల శ్రేణిని మార్కెట్లోకి తీసుకువచ్చిన హై బర్డ్. ఇది లూధియానా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ.
''సాధారణ శ్రేణికి చెందిన సైకిళ్ల ధరలు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటాయి. బుల్పవర్ సైకిల్ ధర రూ.4,000 ఉంటుంది. సైకిల్లో కీలకమైన భాగాలైన ఫ్రేమ్, ఫోర్క్లకు ఈ గ్యారంటీ వర్తిస్తుంది. ఈ సైకిల్ను కొనుగోలు చేసిన తరువాత 25 సంవత్సరాల్లో ఎపుడైనా ఫ్రేమ్, ఫోర్క్లలో లోపం తలెత్తితే మేం వాటిని మార్చి కొత్తవి వేసి ఇస్తాం. ఈ మోడల్కు వాడిన ముడిపదార్థాలను ప్రత్యేక క్వాలిటీ లోహంతో రూపొందించాం. భారీ బరువును తట్టుకొనేటట్లు దీనికి విశిష్ట డిజైన్ను అందించాం.'' అని కంపెనీ ఛైర్మన్ అంటున్నారు.
0 comments:
Post a Comment